Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1837 Registered: 10-2005 Posted From: 107.4.212.46
Rating: N/A Votes: 0 | Posted on Thursday, October 04, 2018 - 6:04 pm: | |
గుంటూరు, విజయవాడపై నజర్ భారీగా రంగంలోకి ఐటీ సిబ్బంది? ఏ క్షణమైనా సోదాలకు సిద్ధం జాబితాలో అధికార పార్టీ నేతలు? అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రలోని ప్రముఖులపై ఆదాయపు పన్ను (ఐటీ) నజర్ పడినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా... ‘రాజధాని’ జిల్లాలు కృష్ణా, గుంటూరులో అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం! దీనికోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ సిబ్బంది సమాయత్తమైనట్లు చెబుతున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సోదాలు జరిపేందుకు వీలుగా తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసు యంత్రాంగాన్ని వీరు కోరినట్లు తెలిసింది. ‘‘ఒక అరగంట ముందు చెబుతాం! ఆ వెంటనే మీరు మాతోపాటు కలిసి రావాలి. బందోబస్తు కల్పించాలి’’ అని అడిగినట్లు సమాచారం! నిజానికి... అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే ప్రముఖులపై ఐటీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజానికి... రెండు మూడు నెలలుగా రాజధాని జిల్లాలపై ఐటీ కన్నేసింది. సోదాలకు అవసరమైన ప్రాతిపదికన సిద్ధం చేసుకుంటోంది. రాజధాని ప్రాంతంలో భూ లావాదేవీలు జరిపిన, పన్నులు కట్టలేదని భావిస్తున్న కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో జాబితా రూపొందించుకుంది. ఇందులో ఒకరిద్దరు ప్రముఖ ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి అంశానికి కొనసాగింపుగానే అమరావతిలో సోదాలు జరుపుతారా? లేక... దానికీ దీనికీ సంబంధం లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. టీడీపీకి చుక్కలు చూపిస్తామని ఒకరిద్దరు బీజేపీ నేతలు గతంలో హెచ్చరించారు. ఎన్నికల ముందు రాజకీయ ప్రత్యర్థులపైకి ఐటీ, ఈడీ వంటి సంస్థలను ప్రయోగించడం మోదీకి అలవాటని సీఎం చంద్రబాబు తరచూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్ ఐటీ’పై రాజకీయంగానూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. |