Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 865 Registered: 05-2017 Posted From: 71.88.44.49
Rating: N/A Votes: 0 | Posted on Friday, June 01, 2018 - 8:31 am: | |
Positive politics chestadu anukunte division politics chestunnadu. Unna aa konchem respect kuda.... పార్వతీపురం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధిని కేంద్రీకృతం చేసినట్టే నవ్యాంధ్రలోనూ చేస్తే రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసిన సందర్భంలో అక్కడకు ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు భారీగా వలసలు వెళ్లారని గుర్తు చేశారు. గురువారం సాయంత్రం ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోరాట యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం విడిపోయాక సొంత రాష్ట్రంలోనే పరాయివాళ్లయిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు వస్తామంటే ఉద్యోగాల్లేవు. పరిశ్రమల్లేవు. వ్యవసాయానికి నీరు లేదు. కనీసం తోటపల్లి, జంఝావతి ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. కానీ వేరే కార్యక్రమాలకు మాత్రం ఖర్చు చేస్తారు. పెరుగుతోన్న ప్రజలకు ప్రభుత్వాలు, పాలకులు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం తదితర కార్యక్రమాలను చేపట్టాలి. కానీ, మళ్లీ హైదరాబాద్లో చేసిన తప్పే సీఎం చంద్రబాబు ఇక్కడా చేస్తున్నారు. అభివృద్ధి అంటూ అమరావతి, గుంటూరు, విజయవాడ తప్ప మిగతా ప్రాంతాన్నంతటినీ గాలికొదిలేశారు. దీనివల్ల మళ్లీ తెలంగాణ ఉద్యమంలా కళింగాంధ్ర ఉద్యమానికి దారి తీసే పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. అభివృద్ధిని పట్టించుకోకపోతే మేధావుల్లో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారనే భావన తలెత్తితే చాలా ప్రమాదం. స్థానిక నేతలు గానీ, మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే పట్టించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంది. |