Musicfan
Bewarse Legend Username: Musicfan
Post Number: 66100 Registered: 05-2004 Posted From: 68.32.1.241
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, May 30, 2018 - 6:32 am: | |
న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్ ధరలు ప్రతి రోజూ పెరుగుతుండటంతో సామాన్యుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 17 రోజుల్లో మొదటిసారి బుధవారం ఆయిల్ కంపెనీలు వీటి ధరలను తగ్గించాయి. అయితే ఈ తగ్గింపు సామాన్యులను పరిహసించే విధంగా ఉండటం శోచనీయం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గింది. దీంతో కాస్త ఊరడిల్లిన సామాన్యులకు కొద్ది గంటల్లోనే ఐఓసీ మరో వార్త చెప్పింది. తమ వెబ్సైట్లో సాంకేతిక లోపం వచ్చిందని, డీజిల్, పెట్రోలుపై లీటరుకు తగ్గింపు 60 పైసలు కాదని, కేవలం ఒక పైసా చొప్పున మాత్రమేనని తెలిపింది. ఐఓసీ తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓసీ జనంతో పరాచికాలు ఆడుతోందని దుయ్యబట్టారు. 16 రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ 16 రోజుల్లో లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.3.80, లీటరు డీజిల్ ధర రూ.3.30 చొప్పున పెరిగింది. Mahanati Audio Review
|