Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 94493 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 | Posted on Friday, October 31, 2014 - 4:32 am: | |
తల్లి కడుపులో ఉండగానే శిశువుకు విజయవంతంగా గుండె ఆపరేషన్ దేశంలోనే తొలిసారి.. ‘కేర్’ వైద్యుల ఘనత 26 వారాల పసిగుడ్డుకు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించిన వైద్యులు ప్రత్యేకంగా చేయించిన సూదితో శస్త్రచికిత్స సాక్షి, హైదరాబాద్: తల్లి గర్భంలో ఎదుగుతున్న ఓ శిశువుకు ముప్పు ముంచుకొచ్చింది! అప్పుడప్పుడే రూపుదిద్దుకున్న ఆ బిడ్డ గుండెకు లోపం ఏర్పడింది. రక్తనాళాలు పూడుకుపోవడంతో దాని పనితీరు మందగించింది. అయితే దీన్ని గుర్తించిన వైద్యులు ఆ శిశువుకు గర్భంలోనే పునర్జన్మ ప్రసాదించారు. దేశంలోనే తొలిసారిగా 26 వారాల పసిగుడ్డుకే విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన సూదిని వినియోగించారు. చిన్ని గుండెకు రక్త సర ఫరాలో తలెత్తిన అవరోధాలను తొలగించడంతో తల్లితో పాటు గర్భస్థ శిశువు కూడా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైద్యులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్కు చెందిన శిరీష(25) ఇటీవల గర్భం దాల్చడంతో సాధారణ పరీక్షల్లో భాగంగా స్థానికంగా ఓ గైనకాలజిస్ట్ను సంప్రదించారు. కడుపులోని బిడ్డ ఎదుగుదల తీరును తెలుసుకునేందుకు ఆమెకు అబ్డామినల్ అల్రా ్టసౌండ్ స్కానింగ్కు సిఫారసు చేశారు. ఈ పరీక్షలో బిడ్డకు హృద్రోగ సమస్య ఉన్నట్లు తేలింది. అబార్షన్ చేయాల్సిందేనని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. దీంతో కంగారుపడిన శిరీష మరో అభిప్రాయం తెలుసుకోడానికి కేర్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. అక్కడ ఆమెకు మరోసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు. గర్భస్థ శిశువు గుండెకు ఎడమవైపున్న ప్రధాన రక్తనాళం 99 శాతం మూసుకుపోవడంతో రక్త సరఫరా సరిగా లేక గుండె పనితీరు నెమ్మదించినట్లు గుర్తించారు. దీంతో శిశువు గుండె ఉండాల్సిన పరిమాణం కన్నా చిన్నగా కుచించుకుపోయినట్లు కనిపించింది. ఈ విషయాన్ని దంపతులకు వివరించిన వైద్యులు... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యేక వైద్య పద్ధతిలో బిడ్డను కాపాడవచ్చని సూచించారు. శిరీష అందుకు అంగీకరించడంతో బిడ్డ పరిమాణానికి సరితూగే నీడిల్స్తో పాటు, బెలూన్లను విదేశాల్లో ప్రత్యేకంగా తయారు చేయించారు. 23వ వారంలోనే చికిత్సకు ఉపక్రమించారు. అయితే ఆ సమయంలో శిశువు కదలికలు ఎక్కువగా ఉండటం, గుండె పరిమాణం చాలా చిన్నగా ఉండటంతో శస్త్రచికిత్సను మరో రెండు వారాలు వాయిదా వేశారు. ప్రత్యేక నీడిల్తో చికిత్స హృద్రోగ నిపుణుడు డాక్టర్ నాగేశ్వరరావు, స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్ మాల్జిని, డాక్టర్ కామశ్రీ, డాక్టర్ సాయిలీల, డాక్టర్ జగదీష్, డాక్టర్ పీబీఎస్ గోపాల్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ కమల నేతృత్వంలోని వైద్య బృందం ఈ అరుదైన శస్త్రచికిత్సపై విస్త్రృతంగా చర్చించారు. 26వ వారంలో అన్నీ పరీశీలించిన తర్వాత గర్భంలో శిశువు సరైన స్థితిలో ఉందని నిర్ధారించుకుని, ఇటీవలే శస్త్రచికిత్స నిర్వహించారు. తల్లికి జనరల్ అనెస్థీషియా ఇచ్చారు. ఆ వెంటనే ప్రత్యేకంగా తయారు చేయించిన సన్నని నీడిల్ ద్వారా ఆల్రా ్టసౌండ్ సహాయంతో ఆమె గర్భంలోని శిశువు తొడపై(ఇంట్రా మస్కులర్) ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత శిరీష గర్భాశయం ద్వారా శిశువు ఛాతీలోకి సన్నని సూదిని పంపించారు. కుచించుకుపోయిన గుండె రక్తనాళంలోకి బెలూన్ని వదిలి దాన్ని 50 శాతం వరకు తెరవగలిగారు. సుమారు రెండున్నర గంటల సమయంలో విజయవంతంగా ఈ ఆపరేషన్ పూర్తయింది. వైద్య పరిభాషలో దీన్ని ఎండో కార్డియోగ్రామ్గా పిలుస్తారని, ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో తల్లికి కానీ, కడుపు లోని బిడ్డకు కానీ ఎలాంటి హాని ఉండదని డాక్టర్ నాగేశ్వరావు తెలిపారు. ప్రస్తుతం శిరీష ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు. ఇందుకైన ఖర్చును కేర్ ఫౌండేషనే భరించిందని, ఆమెకు ప్రసవ సమయంలో కూడా వైద్య సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. |