Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7049 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 | Posted on Friday, August 08, 2014 - 8:40 pm: | |
Musicfan: Kanumuri Bapiraju is going resign from TTD
రాజీనామా చేయను...కొత్తబోర్డు వేస్తే స్వాగతిస్తా : బాపిరాజు Published at: 08-08-2014 19:51 PM తిరుమల, ఆగస్టు 8 : దైవ సన్నిధిలో ప్రమాణం చేసిన తాను స్వతహాగా పదవిని వదులుకోబోనని, ప్రభుత్వం నూతన బోర్డును నియమిస్తే మాత్రం స్వాగతిస్తానని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తిరుమల అన్నమయ్య భవన్లో మీడియాతో మాట్లాడారు.తాను కోరుకోకపోయినా వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో సేవ చేయడానికి రెండోసారి కూడా అవకాశం కలిగిందన్నారు. ప్రభుత్వం మారిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పానని తెలిపారు. ఈ నెల 24వరకు తన పదవీ కాలం ఉందని, స్వతహాగా తాను ఈ పదవిని వదులుకోవడానికి సాహసించలేకపోతున్నానని బాపిరాజు చెప్పానన్నారు.అయితే రాజకీయాల్లో మీకు వత్తిళ్ళు ఉండడం సహజమని, కొత్త పాలకమండలి ఏర్పాటు చేసే వరకూతానేకొనసాగుతానని చంద్రబాబుకు వివరించానన్నారు. ఆ తరువాత రెండో సారి సీఎంను తిరుమల పర్యటనలో తాను కలవాలనుకుంటే భద్రతా సిబ్బంది అనుమతించలేదని వార్తలు రావడం బాధనిపించిందన్నారు. టీటీడీకి కొత్త పాలకమండలి వస్తే స్వాగతించి వెళ్తానన్నారు. అంతేకానీ తాను ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించబోనని స్పష్టం చేశారు. దాదాపు మూడు సంవత్సరాల పదవీ కాలంలో టీటీడీ ఈవో, జేఈవోలతో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడినా మనసులో పెట్టుకోకుండా అందరిని కలుపుకుని పోతూ టీటీడీకి సేవలందించానన్నారు. ఇటీవల తాను పుణ్యక్షేత్రాలకు, అమెరికా పర్యటనకు వెళ్ళాల్సి ఉందని టీటీడీ ఈవో గోపాల్కు తెలియజేయగా, పర్యటన ముగించుకుని తిరిగి రండని ఈవో బదులిచ్చారన్నారు. అప్పటిదాకా పదవి వుంటే చైర్మన్గా వస్తా...లేదంటే భక్తుడిగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటానని భావించానన్నారు. కన్నయ్యలాంటి కార్మిక నాయకుడు మెంబర్గా ఉన్న పాలకమండలిని స్నేహపూర్వక వాతావరణంలోనే నడిపించానన్నారు. చిన్న చిన్న మనస్పర్థలొచ్చినా తానే సర్దుకుపోయానన్నారు. కాగా వీఐపీ బ్రేకు దర్శనం అనే పదం వాడడం మంచిది కాదన్నారు. బ్రేకు దర్శనం అంటే చాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామాన్య భక్తులే వీవీఐపీలుగా భావించి వారికి సేవలందించడంలో ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ విషయంలో జేఈవోతో విభేదాలు వచ్చినా ఆయనకు నచ్చజెప్పానన్నారు. అలాగే శ్రీవారి సన్నిధిలో భక్తులను నెట్టకుండా సావధానంగా వెళ్లేందుకు తొలుత రెండు వరుసల క్యూలైన్లు ఏర్పాటు చేయాలని తానే సూచించానన్నారు. 8నెలల క్రితమే తాను ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు.అయితే ఈవో, జేఈవో చివరి క్షణంలో రెండు వరుసలను మూడుగా మార్చారన్నారు. దానికి సంబంధించిన ఇంజినీరింగ్ ప్లాను తానే తెలియజేశానని చెప్పారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం తన హయాంలోనే రాత్రి వేళలో కొనసాగుతున్న వీఐపీ బ్రేకు దర్శనాన్ని రద్దు చేయించానన్నారు. |