Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7048
Registered: 03-2004
Posted From: 50.133.90.130

Rating: N/A
Votes: 0

Posted on Friday, August 08, 2014 - 8:39 pm:   


Musicfan:

ABN/TV9 are going to be restored in T, latest by tomorrow. - Jayadekar meeting with MSO in progress






న్యూఢిల్లీ, ఆగస్టు 8 : తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాలను సోమవారంలోగా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌వోలను ఆదేశించింది. పునరుద్ధరించకపోతే లైసెన్సులను రద్దు చేస్తామని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఎంఎస్‌వోలను హెచ్చరించారు. శుక్రవారం రాజ్యసభలో మీడియా స్వేచ్ఛపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం ఎంఎస్‌వోలతో కేంద్ర ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సమావేశమయ్యారు. తెలంగాణలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమని ఎంఎస్‌వోలకు ఆయన స్పష్టం చేశారు.

ఈ భేటీలో ఎంఎస్‌వో అషోసియేషన్ ప్రతినిధి ఎస్.ఎన్ శర్మ, ఉపాధ్యాయ ప్రభృతులు పాల్గొన్నారు. తెలంగాణలో ఈ రెండు ఛానళ్లను పునురుద్ధరించాలని లేని పక్షంలో మీ లైసెన్సులను రద్దు చేస్తామని, సోమవారం లోగా ఏ విషయం కేంద్రానికి స్పష్టం చేయాలని శర్మకు కేంద్రమంత్రి జవదేకర్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన శర్మ తెలంగాణలో ఉన్న ఎంఎస్‌వోలందరితో మాట్లాడి చానెళ్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రికి హామీ ఇచ్చినట్లుగా తెలిసింది.

రెండు ఛానెళ్లను పునరుద్ధరించేవరకు వాటి తరఫున నేను పోరాడతానని, మీరు ఎందుకు ప్రసారాలు పునరుద్ధరించరో చూస్తానని జవదేకర్ హెచ్చరించారు. ప్రేమతో చెప్పే మాటలను విని ఆచరణలో పెడితే మంచిదని.. లేదంటే ఎంఎస్‌వోలు కేంద్రంతో పోరాటం చేయవలసి ఉంటుందని జవదేకర్ హెచ్చరిక ధోరణితో అన్నారు. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో ఎంఎస్‌వోల నాయకులు పాల్గొన్నారు. ఛానెళ్లు, మీడియా గురించి వారందరికీ జవదేకర్ వివరించారు. ఎంఎస్‌వోలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నెలన్నర రోజులుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే మేం చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని ఆయన ప్రశ్నించారు.

దీంతో ఎంఎస్‌వోలు కూడా కేంద్రప్రభుత్వ వైఖరిని గమనించి.. నిజమే ఇలా జరిగి ఉండకూడదు అన్నట్లు మాట్లాడారు. సోమవారంలోగా ఏబీఎన్, టీవీ-9 ఛానెళ్ల ప్రసానాలను పునరుద్ధరించాలని, లేని పక్షంలో కేబుల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 47 ప్రకారం లైనెస్సులు రద్దు చేసి తీరతామని జవదేకర్ ఎంఎస్‌వోలను హెచ్చరించారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని, మరోసారి చర్చలకు కూడా అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.





న్యూఢిల్లీ, ఆగస్టు 8 : మీడియా ప్రసారాలను సెన్సార్ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికే లేదని... అలాంటిది ఎంఎస్‌వోలకు ఎవరు ఇచ్చారని కేంద్ర ప్రసారాలశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై శుక్రవారం రాజ్యసభలో చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల ఫలితమే భావప్రకటన స్వేచ్ఛ హక్కు అని అన్నారు. బాధ్యతలు లేకుండా ఏ స్వేచ్ఛా ఉండదని ఆయన అన్నారు. స్వేచ్ఛలో విధులు, బాధ్యతలూ ఉంటాయని జవదేకర్ తెలిపారు. మీడియా కూడా స్వయం నియంత్రణ పద్ధతిని రూపొందించుకోవాలని ఆయన సూచించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశానని జవదేకర్ చెప్పారు. ఛానెళ్ల నిలిపివేతపై తమ ప్రమేయం లేదని టీ. సీఎం కేసీఆర్ బదులుగా సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. అందువల్ల ఇప్పుడు మేం తీసుకోబోయే చర్యల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదనుకుంటానని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఎంఎస్‌వోలతో సమావేశం అవుతున్నట్లు ఆయన చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేదిలేదని ఆయన హెచ్చరించారు. ఛానెళ్లపై సెన్సార్ సరికాదని తేల్చి చెబుతానని, ఎంఎస్‌వోలు దారికి వస్తే సరే... లేదంటే చట్టపరంగా ఎంఎస్‌వోలపై చర్యలు తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వం వెనుకాడదని జవదేకర్ స్పష్టం చేశారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration