Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7036 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 | Posted on Monday, August 04, 2014 - 9:51 pm: | |
Gudivada04:
kadathadu ani evaru annaru ande... Just ala bedisthadu anna maata.... rojuko sollu chethu vasthunnadu.. mundu mundu kooda chepthaduu.. బాబు వల్లే... తెలుగువారంతా ఒక్కటే అంటూ టి-పై కక్షా? ముద్దనూరు, వీటీపీఎస్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిపివేత అనైతికం కేసీఆర్ ఆగ్రహం.. కేంద్రానికి ఫిర్యాదు! - విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేత అనైతికం - చంద్రబాబుపై కేసీఆర్ ఆగ్రహం.. కేంద్రానికి ఫిర్యాదు! హైదరాబాద్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అసలే తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ రాషా్ట్రన్ని మరింత ఇబ్బందుల పాలుచేసేందుకే ఆంఽధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విద్యుదుత్పత్తి నిలిపివేసిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కడప జిల్లా ముద్దనూరులోని 210 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్, విజయవాడలోని వీటీపీఎస్ 500 మెగావాట్ల యూనిట్లలో విద్యుత్ నిలిపివేయటం దారుణం, అనైతికం అని ఆయన ధ్వజమెత్తారు. ఈ రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి నిలిపివేయటం వల్ల తెలంగాణకు రావాల్సిన 710 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయిందన్నారు. ఓ వైపు తెలుగు ప్రజలంతా ఒక్కటే అంటూనే.. తెలంగాణ ప్రజలను ఇబ్బందులపాలు చేసే నిర్ణయం తీసుకోవడం ఏమిటని చంద్రబాబుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో కరెంటు కష్టాలను మరింత పెంచాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఆయన కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. |