Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6881 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, June 04, 2014 - 8:48 pm: | |
జగన్ మోహన్ నేతృత్వం లోని వై ఎస్ ఆర్ సి పి పార్టి తెలంగాణా రాష్ట్ర సమితిలో విలీనం కానుందా? అంటే కావొచ్చు అనే అంటున్నాయి తెరాసా వర్గాలు. వై సి పి నుంచి ఖమ్మం జిల్లలో గెలిచినా పార్లమెంట్ సభ్యుడితో పాటు, ముగ్గురు ఎమ్మెల్యేలకు తెలంగాణా లో పెద్దగా పనిలేదు. పార్లమెంట్ మెంబర్ కు కూడా పెద్దగా పని లేదు. నిధులు ఇబ్బంది వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అందుకే తెలంగాణా వైసిపి పార్టిని టి ఆర్ ఎస్ లో విలీనం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఇరు పార్టి లలోను మొదలైందని ఆయా పార్టి వర్గాలు అంటున్నాయి. వైసిపి కి చెందినా ఖమ్మం ఎం పి పొంగులేటి తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టి ఆర్ ఎస్ అగ్ర నాయకులతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. కె సి ఆర్ తో జగన్ కూడా ఫోన్ లో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణా అసెంబ్లీ లో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, వచ్చే అయిదేళ్ళలో ఏమైనా పరిస్థితులు మారితే చూద్దామని, అధికారం లో ఉన్న పార్టి లోకి వెళ్ళడం వల్ల లాభం జరుగుతుందని స్వయంగా జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఎం పి తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు టి ఆర్ ఎస్ అగ్ర నేతలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని టి ఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. పార్టి ఫిరాయింపు చట్టం వర్తించ కుండా ఉండాలంటే పార్టిని విలీనం చేస్తున్నట్టు ప్రకటించాల్సి వస్తుందని , ఇటీవల బహుజన సమాజ్ పార్టి కి చెందినా ఇద్దరు ఎమ్మెల్యేలు అదే పని చేశారని టి ఆర్ ఎస్ నాయకులు అంటున్నారు. విలీనం చెయ్యడం వల్ల పార్టి ఫిరాయింపు చట్టం వర్తించదని టి ఆర్ ఎస్ శ్రేణులు అంటున్నాయి. బి ఎస్ పి నుంచి వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఇంద్రకరణ్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే తెలంగాణ వై సి పి కూడా విలీనం అయితే మంత్రి పదవులు, ఇతరత్రా పదవులు గురించి ఇంకా స్పష్టమైన చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి ఇదే గనుక జరిగితే వై సి పి మంచి నిర్ణయమే తీసుకున్నట్టు అవుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎం జరుగుతుందో చూద్దాం. |