Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6878 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 | Posted on Monday, June 02, 2014 - 7:57 pm: | |
Just some info... తెలంగాణవ్యాప్తంగా దాదాపు 34 వేల పరిశ్రమలుండగా అందులో 95 % కంపెనీలు హైదరాబాద్లోనే నమోదై ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే 3,945 కంపెనీలతో రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. మిగతా ఎనిమిది జిల్లాల్లో మెదక్ (242), వరంగల్ (224) మాత్రమే రెండొందలకు పైబడిన కంపెనీలున్నాయి. ఇతర జిల్లాల్లో ఎక్కడా 200కు మించలేదు. ఆదిలాబాద్ (104), కరీంనగర్ (195), ఖమ్మం (162),మహబూబ్నగర్ (98), నల్గొండ (159), నిజామాబాద్ (72).. ఇది ఆయా జిల్లాల్లో నమోదైన కంపెనీల సంఖ్య. తెలంగాణలో ఉన్న పరిశ్రమల్లో కూడా 60 శాతం సీమాంధ్ర పారిశ్రామికవేత్తలకు చెందినవే. ఇందులో కూడా కనీసం 25 శాతం కంపెనీలు వివిధ పారిశ్రామిక గ్రూప్లకు చెందినవి. సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమల రిజిస్టర్డ్ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి మార్చాలని నిర్ణయిస్తే తెలంగాణ భారీ స్థాయిలో పన్నుల రాబడిని కోల్పోవాల్సి వస్తుంది. రిజిస్టర్డ్ కార్యాలయాలున్న చోటనే కంపెనీలు సర్వీసు టాక్స్, ఆదాయం పన్ను, వ్యాట్.. వగైరా చెల్లిస్తాయి. విభజన నేపథ్యంలో ఈ పెట్టుబడులను కాపాడటంతో పాటు కొత్త పెట్టుబడుల ఆకర్షణకు కెసిఆర్ ప్రభుత్వం గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. ఇదేమంత ఆషామాషీ విషయం కాదు. ప్రభుత్వం స్వయం గా ప్రయోగించే భాషలో, ఆచరణలో ఇప్పటికీ విభజన ఉద్యమ స్వభావాన్నే కొనసాగిస్తే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ధోరణి కార్మికులపై కూడా ప్రసరిస్తే పరిశ్రమలు నడపడం సాధ్యంకాదన్నది వారి అభిప్రాయం. పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుందనేది కీలకమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు అన్నారు. |