Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Mudiripoyina Bewarse
Username: Blazewada

Post Number: 21104
Registered: 08-2008
Posted From: 220.255.2.222

Rating: N/A
Votes: 0

Posted on Monday, May 26, 2014 - 12:14 am:   

విజయవాడ కేంద్రంగా జిల్లా ?

(విజయవాడ, ఆంధ్రజ్యోతి) ః కృష్ణా జిల్లాను రెండుగా చేయనున్నారా? దీనిపై రెవెన్యూవర్గాలలోను, ఇతరత్రా కూడా చర్చ జరుగుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడల ద్వారా వ్యాపారం చేసేందుకు బందరు తీరాన్ని ఎంపిక చేయడంతో బందరునే జిల్లా కేంద్రంగా అప్పటి నుంచి పరిగణిస్తూ వచ్చారు. అప్పట్లో ఉన్న జిల్లా నైసర్గికస్వరూపానికి, ఇప్పటి స్వరూపానికి చాలా వ్యత్యాసం ఉంది. జనాభా సుమారు 44 లక్షలకు పైగా ఉంది. అటు జగ్గ్యపేట, ఇటు తిరువూరు వరకు, మరో వైసు సముద్ర తీరాన నాగాయలంక వరకు జిల్లా వ్యాపించి ఉంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి వెళ్ళడానికి జగ్గయపేట, తిరువూరు తదితర ప్రాంతాల వారు ఎన్నో వ్యయ ప్రయాసలకు గురికావాల్సి వస్తోంది, ఈ పరిస్థితుల్లో పది సంవత్సరాల క్రితమే జిల్లాను విజయవాడ కేంద్రంగా, మచిలీపట్నం కేంద్రంగా రెండుగా చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో అది అమలుకు నోచుకోలేదు. రాష్ట్రం విభజనతో సీమాంధ్ర అభివృద్ధి తప్పనిసరి అయింది. అందులో భాగంగానే బీజేపీ సీమాంధ్రలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తామని, ఒక్కో జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబుతూ వచ్చింది. టీడీపీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేస్తామని చెప్పింది. దీంతో పాత ప్రతిపాదనలకు దుమ్ముదులిపే అవకాశం కనిపిస్తుంది. పశ్చిమ కృష్ణాను ఒక జిల్లాగా, తూర్పు కృష్ణాను మరో జిల్లాగా మారుస్తారన్న చర్చ జరుగుతోంది. రెవెన్యూ వర్గాలు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాయి. మరో వైపు విజయవాడ రెవెన్యూ డివిజన్‌ను రెండుగా మార్చాలన్న ప్రతిపాదన కూడా ఐదు సంవత్సరాల క్రితమే తయారయింది. నందిగామ హెడ్ క్వార్టర్‌గా డివిజన్ ఏర్పడితే అందులో ఉండే రెవెన్యూ మండలాలు, నియోజకవర్గాలు కూడా సిద్ధం చేశారు. వాస్తవంగా కిందటేడాది రెవెన్యూ సదస్సుల సమయంలోనే కొత్త డివిజన్‌ను ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ ఎందుకో ఈ ఫైల్‌ను పక్కన పెట్టారు. ఇప్పుడు తప్పకుండా చేస్తారని భావిస్తున్నారు.
అలాగే విజయవాడను మూడు మండలాలుగా చేయాలన్న ప్రతిపాదన కూడా పెండింగులో ఉంది. దీనిని కూడా తెరవైకి తీసుకువస్తున్నారు. విజయవాడ జనాభాకు ఒకే రెవెన్యూ మండలం ఉండడం వల్ల ఒకే తహసీల్దార్ వల్ల అన్ని పనులు నెరవేరడం లేదు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తహసీల్దార్ ఏదైనా ప్రొటోకాల్ పనులలో గాని, ఇతర త్రా పనులలో గాని ఉంటే సర్టిఫికెట్లు, ఇతరత్రా ధ్రువీకరణలు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విజయవాడను పటమట, సత్యనారాయణపురం, భవానీపురం అనే మూడు మండలాలుగా చేయాలన్న ప్రతిపాదన గతంలోనే వచ్చింది. అయితే ఇది ఎందుకనో అమలులోకి రాలేదు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రతిపాదనలు, పాలనావసరాలు వీటన్నిటిని పరిగణనలోకితీసుకుంటే మార్పులు చోటుకుటుంటాయన్నా వాదనలు వినిపిస్తున్నాయి.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration