Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6841 Registered: 03-2004 Posted From: 50.133.90.130
Rating: N/A Votes: 0 | Posted on Monday, May 19, 2014 - 6:16 pm: | |
పట్టుబట్టి తినిపించిన గవర్నర్ నరసింహన్ చంద్రబాబు కష్టపడి పనిచేస్తారు మీరూ చేతులు కలపండి.. జట్టుగా సహకరించండి తెలుగుదేశం నేతలకు నరసింహన్ ఉద్బోధ రెచ్చగొట్టి తెలంగాణకు నష్టం చేయొద్దు! అలా చేస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు రావు కోదండరాం వ్యాఖ్యలపై చంద్రబాబు హైదరాబాద్, మే 19 : 'చంద్రబాబు బాగా దూరదృష్టి కలిగిన నాయకుడు. బాగా కష్టపడతారు' అని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. అదే సమయంలో... ఆయన ఒక్కరూ పని చేస్తే చాలదని, అందరూ కలిసి పని చేయాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం సాయంత్రం గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో అందుబాటులోఉన్న ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఆయన రాజ్భవన్కు వెళ్లారు. ఈ భేటీలో చంద్రబాబుపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. "చంద్రబాబు మంచి పాలనాదక్షుడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుకొన్న పని సాధించే వరకూ పట్టువీడరు. ఈసారి ఎన్నికలకు మంచి మ్యానిఫెస్టో తయారు చేసుకొని ప్రజల వద్దకు వెళ్లారు. గెలుపు సాధించి వచ్చారు'' అని ఆయన అన్నారు. సరదా... సరదాగా... టీడీపీ నేతలతో గవర్నర్ చనువుగా, చొరవగా, సరదాగా గడిపారు. చంద్రబాబుకోసం మిఠాయి తెప్పించారు. "మీరు స్వీట్లు తినరని, డైటింగ్ చేస్తారని నాకు తెలుసు. ఈ పూటకు డైటింగ్ పక్కనపెట్టండి. రేపటి నుంచి చేద్దురులే! ఈ స్వీటు తినండి. రేపు ఇంకాస్త అదనంగా వ్యాయామం చేయండి. మిఠాయి మాత్రం వద్దనవద్దు'' అని అన్నారు. గవర్నర్ మాటలకు చంద్రబాబు కూడా నవ్వేసి స్వీటు తీసుకున్నారు. మాటల మధ్యలో గవర్నర్ దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడును గుర్తు చేసుకొన్నారు. "అప్పుడు టీడీపీ అధికారం కోల్పోయాక చంద్రబాబుకు భద్రత తగ్గించారు. కేంద్ర హోం కార్యదర్శిగా ఉన్న నా వద్దకు ఎర్రన్నాయుడు వచ్చి విషయం చెప్పారు. నేను వెంటనే అప్పటి హోం మంత్రి శివరాజ్ పాటిల్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాను. ఎర్రన్నాయుడు బాగా కలుపుగోలు మనిషి. ఆయన లేనిలోటు తీరనిది'' అని గవర్నర్ అన్నారు. ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ ఎంపీగా, తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారని చంద్రబాబు వారిద్దరినీ గవర్నర్కు పరిచయం చేశారు. వారిద్దరినీ గవర్నర్ అభినందించారు. కుటుంబసభ్యుడిని... 'మనమందరం ఒక కుటుంబం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించండి. నేను ఇక్కడ ఎంతకాలం ఉంటానో తెలియదు. ఉన్నంతవరకూ అందరం సమష్టిగా పనిచేద్దాం. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని సంయమనంతో పరిష్కరించుకొని ముందడుగు వేద్దాం' అని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలకు కొంత హితబోధ కూడా చేశారు. "మీకు చంద్రబాబు రూపంలో మంచి విజన్ ఉన్న నాయకత్వం ఉంది. దానిని ఆచరణరూపంలోకి తేవడానికి మీరంతా ఆయనకు సహకరించాలి. మీరంతా ఒక టీం మాదిరిగా కలిసికట్టుగా పనిచేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆయన ఒక్కరే పనిచేస్తే చాలదు. ప్రజలు మీపై ఎన్నో ఆశలతో గెలిపించారు. వాటిని నెరవేర్చడానికి కష్టపడండి'' అని కర్తవ్యబోధ చేశారు. చంద్రబాబుతో ఏకాంత భేటీ చంద్రబాబుతో గవర్నర్ సుమారు పది నిమషాలు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన పరిణామాల్లో ఇప్పటిదాకా జరిగిన పని... ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు... కొత్త రాష్ట్రానికి నిధుల లభ్యత తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ.. వాటిపై దృష్టి పెట్టాలని, అభద్రతకు తావివ్వకుండా వ్యవహరించాలని కోరినట్లు సమాచారం. బాబుకు అభినందనల వెల్లువ ఎన్టీఆర్ భవన్లో అభిమానుల సందడి సీమాంధ్రకు కాబోయే సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పలువురు నాయకులు.. కార్యకర్తలు.. అభిమానులు తరలిరావడంతో సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సందడి నెలకొంది. సోమవారం గవర్నర్ను కలిసి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న చంద్రబాబుకు పలువురు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నాయకులు అశోకగజపతి రాజు, మురళీమోహన్, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, కేసినేని నాని, ఎర్రబెల్లి దయాకర్, అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎల్.రమణ, మల్లారెడ్డి, మాగంటి గోపీనాథ్, అరెకెపూడి గాంధీ, అంబికా కృష్ణ, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, యనమల రామకృష్ణుడు, మోత్కుపల్లి నర్సింహ్ములు, రావుల చంద్రశేఖర్రెడ్డి, తదితరులు చంద్రబాబును కలిసి అభినందనలు తెలిపారు. |