Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6602
Registered: 03-2004
Posted From: 50.133.52.77

Rating: N/A
Votes: 0

Posted on Sunday, April 13, 2014 - 8:09 am:   


Black_pearl:




nijamga blood thirsty ante...

హైదరాబాద్, ఏప్రిల్ 13 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అమలు చేయబోయే పథకాల్లో లోపాలు వెతికిన పత్రికలను జైల్లో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, పథకాల తీరును ముందే హైకోర్టు, కాగ్‌కు వివరిస్తామని ఆయన తెలిపారు. అప్పటికీ పత్రికలు లోపాలు వెతికితే జైల్లో పెడతామని ఆయన హెచ్చరించారు.

వైసీపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆ పార్టీ నేత జగన్మోహన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు. పాలనా వ్యవస్థలో వేగం పెంచుతామని ఆయన అన్నారు. అయినా కొన్ని పత్రికలు అదే పనిగా దుమ్మెత్తిపోస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం హైకోర్టు, కాగ్ వద్దకు వెళుతుందని, తాము ప్రవేశపెట్టబోయే పథకాలకు సంబంధించిన ఫైల్‌ను ముందే పంపిస్తామని, తప్పులు ఉంటే చెప్పాలని, వాటిని సరిచేసి తప్పకుండా అమలు చేస్తానని ఆయన అన్నారు. అమలు చేసిన తర్వాత తప్పులు వెదికి, వక్రీకరించి రాసే పత్రికాధిపతులపై చర్యలు తీసుకుని, వాళ్లను జైల్లో పెట్టాలని జగన్ పేర్కొన్నారు.

ప్రతి పేదవాడి ఇంట్లో వైఎస్‌తోపాటు తన ఫోటో కూడా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు జగన్ స్పష్టం చేశారు. పదవులతో ప్రలోభపెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ చూసినా తాను లొంగలేదని ఆయన అన్నారు.

అయితే పథకం ప్రవేశపెట్టడానికి ముందు హైకోర్టు, కాగ్‌ను సంప్రదించడం సరే... పథకం అమలులో లోపాలు ఉంటే ఎత్తి చూపకుండా మీడియా ఎలా మౌనంగా ఉంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్ హయాంలో అన్ని వ్యవస్థలను లోబరుచుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ ఉండగా, ఆయన కుమారుడు జగన్ మీడియాను బెదిరించడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజాలు నిర్భయంగా రాసే పత్రికా యజమానులను జైల్లో పెడతామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని విమర్శలు వస్తున్నాయి

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration