Superman
Pilla Bewarse Username: Superman
Post Number: 977 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 | Posted on Saturday, April 12, 2014 - 3:30 pm: | |
http://eenadu.net/district/inner.aspx?dsname=Krishna&info=kri-b17 సీమాంధ్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ తలపెట్టిన యువప్రభంజన యాత్ర శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ప్రారంభమైంది. ముందుగా నిమ్మకూరులోని ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. లోకేష్ యాత్రకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సభాస్థలిపై నారాలోకేష్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అతి పెద్ద మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం, తెలంగాణను సామాజిక తెలంగాణగా నిర్మించడం కేవలం టీడీపీతోనే సాధ్యమవుతుందని లోకేష్ తెలిపారు. నందమూరి స్వస్థలం నుంచి యువప్రభంజన యాత్ర ప్రారంభించడం అధృష్టంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఐదేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురంచి ప్రతీ యువతీయువకుడికి తెలియచేసేందుకు యువ ప్రభంజన యాత్ర చేపట్టినట్లు లోకేష్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ను చిత్తుగా ఓడించే బాధ్యత ప్రజలపై ఉందని నారాలోకేష్ విజ్ఞప్తి చేశారు. |