Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20241 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 02, 2014 - 5:46 am: | |
ee case edo cover up cheyadaniki hurry burry ga close chesesaru, malli modati kochindi. అనూహ్య కేసు మళ్లీ మొదటికి Published at: 02-04-2014 04:32 AM మచిలీపట్నం, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): కొలిక్కి వచ్చిందని భావించిన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎస్తేర్ అనూహ్య కేసు మళ్లీ మొదటికి వ స్తోంది. ఆమె హత్యపై ఇంకా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెను హత్య చేసినట్టు భావిస్తున్న చంద్రభాను వేలిముద్రలు, సెమన్, ఇతర ఆనవాళ్లు ఏమీ హత్యా స్థలంలో సేకరించిన ఆనవాళ్లతో సరిపోలలేదని, అనూహ్య మృతదేహంపై చంద్రభాను డీఎన్ఏ ఆనవాళ్లు దొరకలేదు. జనవరి ఐదున ఆమె హత్యకు గురికాగా.. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. నిందితుడి కోసం తీవ్రగాలింపు చేపట్టి.. అనూహ్యను అరెస్టు చేసింది చంద్రభాను అని తేల్చారు. అతడిని నాసిక్లో అరెస్టు చేశారు. అనూహ్యపై అత్యాచారంచేసి ఆపై హత్యచేసినట్టు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడని చెబుతూ ఆ మేరకు సెమన్ పరీక్షలు నిర్వహించారు. అయితే, అనూహ్య మృతదేహంపై చంద్రభాన్ డీఎన్ఏ నమూనాలేవీ లేవంటూ రాష్ట్ర ఫోరెన్సిక్ లాబొరేటరీ ముంబై పోలీసులకు ఓ నివేదిక సమర్పించింది. దీంతో, అతడే హత్య చేశాడని నిరూపించడానికి ఇప్పుడు దర్యాప్తు అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక, ఈ నెల మూడో వారంలో చార్జిషీటు దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్న పోలీసులు చంద్రభానును విచారిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక సరిపోలకపోవడంతో కొత్తగా అనుమానాలు వస్తున్నాయి. దీనిపై అనూహ్యతండ్రి జోనాథన్ప్రసాద్ టెస్టు రిపోర్టుల పోలికపై అభ్యంతరం వ్యక్తం చేశారు.హత్య జరిగిన 11రోజుల తర్వాత మృతదేహం లభ్యమైందని, అప్పటికే బాగా కుళ్లిపోవడంతో పరీక్షలు ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తుచేసి న్యాయం చేయాలని ముంబై డీసీపీని కోరినట్టు తెలిపారు. |