Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20240 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, April 02, 2014 - 3:38 am: | |
Gudivada04:
అఫ్గన్ యుద్ధ భూముల్లో, ఇరాక్ రణసీమల్లో ఆకాశంలో తిరుగాడే డ్రోన్ విమానాలు ఇప్పుడు ఇండియాకి కూడా రానున్నాయి. అయితే ఈ మానవ రహిత విమానాలు మారణహోమం చేసేందుకు కాదు, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ప్రచారం చేసేందుకు వస్తున్నాయి. ఢిల్లీ ఐఐటీకి చెందిన బ్రిజ్ కిశోర్ మౌర్య, తన్మయ్ బున్ కర్ అనే ఇద్దరు కుర్రాళ్లు ఈ మానవ రహిత విమానాలను మోడీ కోసం ప్రచారం చేసేందుకు రూపొందించారు. నాలుగువేల అడుగుల ఎత్తున రిమోట్ కంట్రోల్ సాయంతో పనిచేసే ఈ మానవ రహిత విమానాలు మోడీ అనుకూల కరపత్రాలను ఆకాశం నుంచి వెదజల్లుతాయి. ఢిల్లీలోని ఇరుకు గల్లీలు, అస్తవ్యస్తపు కరెంటు వైర్ల వల్ల కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని దీనిలో ఒక సెన్సర్ ను అమర్చారు. అది వైర్లు, బిల్ బోర్డుల వంటి అడ్డంకులు వచ్చినప్పుడు రిమోట్ కంట్రోల్ తో దాన్ని నడిపే వ్యక్తికి ముందస్తు సూచన ఇస్తుంది. మౌర్య, బున్కర్ లు ఐఐటియన్స్ సపోర్ట్ మోడీ అనే గ్రూప్ కి చెందిన వారు. ఇందులో దాదాపు 500 మంది ఐఐటియన్లు ఉన్నారు. ఈ సారికి ఈ మానవ రహిత విమానం ఢిల్లీ వరకే పరిమితమౌతుంది. రాబోయే రోజుల్లో ఇది దేశమంతా విస్తరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. |