Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20223 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, April 01, 2014 - 3:48 am: | |
Kingchoudary:
Godfather:
YSRCP counter attack sstarted. హైదరాబాద్ : దిగజారుడు రాజకీయాలకు పవన్ కల్యాణ్ ఆదిగురువు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. జనసేన పార్టీ ఉంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ముసుగు తొలగిందని ఆమె వ్యాఖ్యానించారు. మంగళవారం వాసిరెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొంతును పవన్ అద్దెకు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలను నేరుగా చంద్రబాబు ఓట్లు అడగలేక ..ఒకపక్క మోడిని, మరోపక్క పవన్ ముసుగు పెట్టుకున్నారని అన్నారు. చంద్రబాబును విమర్శించనందుకే.. పవన్కు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఎల్లోమీడియా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వార్తల పేరిట ఈనాడు సొంత కథనాలు అల్లుతోందని, చంద్రబాబు, పవన్ ఇద్దరూ శిఖండులేనన్నారు. సామాన్య ప్రజలు ఆలోచించినట్లుగా కూడా పవన్ ఆలోచించలేకపోతున్నారన్నారు. ఒకపక్కకు ఒరిగిపోయి చంద్రబాబుకు ఆసరా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. 2009లో శత్రువైన చంద్రబాబు .... 2014కు వచ్చేసరికి మిత్రుడైపోయాడని ఎద్దేవా చేశారు. http://www.sakshi.com/news/elections-2014/vasireddy-padma-takes-on-pawan-kalyan- chandrababu-naidu-118205?pfrom=home-top-story |