Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20221 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Monday, March 31, 2014 - 8:29 pm: | |
Bewarsegadu:buggalodiki
జయనామ ఉగాది పంచాంగ శ్రవణంలో మారేపల్లి రామచంద్రశాస్త్రి సాక్షి, హైదరాబాద్: జయ నామ ఉగాది తెలుగు కొత్త సంవత్సరంలో గ్రహగతులు వైఎస్సార్ కాంగ్రెస్కు బాగా అనుకూలంగా ఉన్నాయని ప్రముఖ సిద్ధాంతి మారేపల్లి రామచంద్రశాస్త్రి తెలిపారు. ఈ పరిస్థితుల్లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో సీమాంధ్రలో ఆ పార్టీ 140 నుంచి 145 స్థానాలు విజయం సాధిస్తుందని చెప్పారు. ఇతర పార్టీలు కలసికట్టుగా వచ్చినా, విడివిడిగా పోటీ చేసినా విజయం మాత్రం ధర్మం వైపే ఉంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ను వ్యతిరేకించే పార్టీలు ఎన్ని పొత్తులు కుదుర్చుకున్నా అపజయాన్ని తప్పించుకోలేవని, వాళ్లు కలసినా పరస్పరం ఓట్ల మార్పిడి జరగదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన సోమవారం పంచాంగ శ్రవణం చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండటంతో పార్టీ ముఖ్యనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పి.ఎన్.వి.ప్రసాద్, వాసిరెడ్డి పద్మ, బి.జనక్ప్రసాద్, గట్టు రాంచంద్రరావు, నల్లా సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. జగన్మోహన్రెడ్డికి అద్భుతమైన, ఉజ్జ్వలమైన భవి ష్యత్తు ఉందని, ఆయన ప్రజలకు నిస్సందేహంగా స్థిరమైన పరిపాలనను అందిస్తారని శాస్త్రి చెప్పారు. |