Kiriti
Pilla Bewarse Username: Kiriti
Post Number: 591 Registered: 05-2004 Posted From: 59.93.104.198
Rating: N/A Votes: 0 | Posted on Saturday, August 17, 2013 - 8:17 pm: | |
http://www.andhrajyothy.com/ContentPage.jsp?story_id=40666&category=headlines హైదరాబాద్, ఆగస్టు 17 : ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంప్రదింపుల ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితికి పరిష్కారం ఏమిటి? తమ పార్టీ ఏం చేస్తే బాగుంటుందన్న అంశంపై శనివారం ఆయన రాష్ట్రంలోని ప్రముఖ దిన పత్రికల సంపాదకులతో తొలి విడత చర్చలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిపై వారి సలహాలు, సూచనలను ఆయన తీసుకొంటున్నట్లు సమాచారం. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ దిన పత్రికల సంపాదకులు 19 మందిని ఆయన ఆహ్వానించగా 16 మంది హాజరయ్యారు. దీని కొనసాగింపుగా సోమవారం ఆయన టీవీ చానళ్ల సంపాదకులతో సమావేశమవుతున్నారు. భేటీలో పాల్గొన్న వారిలో ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత విలేకరులతో సంక్షిప్తంగా మాట్లాడారు. "హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర చాలా ఉంది. ఈ విషయంలో ఆయనకు అంతర్జాతీయంగా వచ్చిన పేరు స్థానికంగా రాకపోవడం దురదృష్టకరం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ఆయన చాలా బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. గతంలో తీసుకొన్న వైఖరికి కట్టుబడి ఉండి సీమాంధ్ర ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మేం సూచించాం'' అని ఉర్దూ దినపత్రిక మున్సిఫ్ సంపాదకుడు ఖాన్ లతీఫ్ ఖాన్ చెప్పారు. "రాజకీయ పార్టీలు అటొక వైఖరి.. ఇటొక వైఖరి కాకుండా ఏదో ఒకటి స్పష్టమైన వైఖరి తీసుకోవాలి. పార్టీలన్నీ స్పష్టమైన వైఖరి తీసుకొంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏ ప్రాంతం వాళ్లు అక్కడి పరిస్థితులకు అనుగుణమైన వైఖరితో ముందుకు వెళ్లినంతకాలం ఇది ఇలాగే మండుతుంది. ఇదే చెప్పాం'' అని ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ తెలకపల్లి రవి చెప్పారు. ఈ సమస్యపై తనను కలిసి ఏ సంఘాల ప్రతినిధులైనా మాట్లాడాలనుకొంటే వారితో కూడా మాట్లాడాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. |