Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 86548 Registered: 03-2004 Posted From: 130.138.227.11
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, August 07, 2013 - 10:47 am: | |
హైదరాబాద్: తాము తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానిపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు! బుధవారం సచివాలయ ఉద్యోగులు బాబును కలిసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని కోరారు. తాను 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని, దానిపై వెనక్కి వెళ్లలేమని అయితే, హైదరాబాదులోని సీమాంధ్ర ఉద్యోగులకు మాత్రం తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారట. బాబును కలిసిన అనంతరం సచివాలయ ఉద్యోగులు విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకమని తాము బాబును కోరామని అయితే, తాను తెలంగాణపై మాట ఇచ్చానని కాబట్టి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని, తమ భద్రత కోసం మాత్రం పార్టీ పోరాడుతుందని చెప్పారని వారు అన్నారు. తమకు రక్షణ కల్పిస్తామని, అన్ని రకాలుగా సహకరిస్తానని బాబు చెప్పారని, అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారన్నారు. రెండు రోజుల క్రితం ఎపిఎన్జీవోలు కలిసినప్పుడు కూడా బాబు అదే విషయం చెప్పిన విషయం తెలిసిందే. |