Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6468 Registered: 03-2004 Posted From: 76.122.134.43
Rating: Votes: 2 | Posted on Thursday, August 01, 2013 - 10:11 pm: | |
C/P from FB తెలంగాణ వస్తే… నాగార్జున సాగర్ ఎడమకాలువ తర్వాతే కుడికాలువకు నీరు. గుంటూరు, కృష్ణా ఎడారి. తెలంగాణ వస్తే… పశ్చిమగోదావరి దాకా ఎడమకాలువ పారదు… గోదావరి ఎడారి. తెలంగాణ వస్తే… పోలవరం గేట్లు తెలంగాణ దాహం తీరాకే తెరుచుకుంటాయి. తెలంగాణ వస్తే… కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ప్రజలు హైదరాబాదులో కొన్న వేల కోట్ల ఆస్తుల విలువ భారీగా పడిపోతుంది! తెలంగాణ వస్తే… మొత్తం కోస్తాంధ్రకు అన్నీ కట్. ఆధునికంగా విస్తరించిన పరిపుష్టమైన ప్రాంతంతో కలిపి హైదరాబాదు తెలంగాణీయుల సొంతం. ఇవి నిజమా కాదా అన్నది వేరే విషయం గాని… విభజన ప్రభావం అన్నింటికంటే ఎక్కువగా పడే ఆ నాలుగు సంపన్న జిల్లా వ్యక్తుల అనుమానాలు, బాధలు, అపోహలు…! కానీ ఉద్యమం మాత్రం విభజన ప్రభావం చాలా తక్కువగా పడే జిల్లాలలోనే తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అనంతపురం!! తెలంగాణ విభజించిన వెంటనే పోరాడింది. పోరాట పటిమ చూపింది… అనంతపురం వీరులు! అప్పుడైనా ఇపుడైనా పతాకస్థాయిలో పోరాడింది. ఉద్యమం ఉజ్వలంగా ఉందని ప్రపంచానికి చాటింది అనంతపురం వాసులే. దేశాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ పూర్వీకులు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను చెప్పులతో కొట్టి… మిలిటరీ బలగాలు లాఠీతో నడ్డి విరుస్తున్నా జడవకుండా దుష్ట కాంగ్రెస్ శక్తుల ప్రతిరూపాలను నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లారు… కానీ సమైక్యాంధ్ర వస్తే అనంతపురం జిల్లాకు ఏమైనా లాభమా? ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణ నుంచి వచ్చే నీళ్లు లేవు. ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగం బెంగుళూరు. నీళ్లు కర్ణాటక నుంచి వస్తాయి. ఇక చెరువులు, బోరు బావులు అత్యధికంగా ఉండే ఈ జిల్లాలో దేవుడి దయ చూపి కురిపించే వర్షాలే దిక్కు. కాబట్టి తెలంగాణ కలిసున్నా విడిపోయినా… అనంతపురానికి ప్రత్యేకంగా వచ్చేదేమీ ఉండదు. మిగతా జిల్లాలతో పోలిస్తే రాష్ట్రంలో హైదరాబాదుతో కంటే ఇక్కడి యువతకు బెంగుళూరుతోనే అనుబంధం. కానీ… నష్టపోయే వారికంటే వీరే ఎక్కువ పోరాట పటిమ చూపారు. అదీ భావోద్వగమంటే.. అదీ ఉద్యమం అంటే. నిజంగా సమైక్యాంధ్ర కోరుకునే ఉద్యమకారులు అనంతపురం వాసుల ఉద్యమ స్ఫూర్తిని పొందాలి. వారిది కేవలం రాష్ట్రం విడిపోకూడదన్న ఆకాంక్ష తప్ప ఇంకే రాజకీయ ప్రయోజనాలు లేవు. ఉంటే గింటే… ఏ దివాకర్ కో, రఘువీరాకో ఉండొచ్చు. కానీ ప్రజలకు కాదు. |