Maveric
Kurra Bewarse Username: Maveric
Post Number: 1998 Registered: 01-2012 Posted From: 103.10.248.182
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, July 31, 2013 - 4:58 am: | |
తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు లేకుండా చర్యలు చేపట్టాలని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు కోరారు.హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించడానికి మూడు,నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని, మరి ఆంద్ర ప్రదేశ్ లో ఇలాంటి రాజధాని నగరం నిర్మించాలని ఆయన అన్నారు. ఇలాంటి నగరాన్ని అభివృద్ది చేయగలమా అన్న ఆవేదన ఉందని అన్నారు.వారి ఉపాధి అవకాశాల మీద ఆందోళన ఉందని, నీటి విషయాలపై అనుమానాలు ఉన్నాయని అవన్ని నివృత్తి చేయాలని ఆయన అన్నారు.ఏదో ఒక మాట చెప్పి,వదలిపెడితే కుదరదని, ఆరు నెలలు ఉండి వీరు పోతారని, ఆ తర్వాత సంగతి ఏమిటన్నది ఇబ్బంది లేకుండా చట్టంలోనే పెట్టాలని అన్నారు.కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిర్మాణం జరగాలని అన్నారు. విద్వేషాలు ఉండకుండా రెండు రాష్ట్రాలలో అబివృద్ది జరగాలని అన్నారు.పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వడం సరైనదేనని, అలాగే ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని అన్నారు.హైదరాబాద్ రెండో రాజధాని చేయాలని గతంలో అంబెద్కర్ చెప్పారని అన్నారు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ లేఖ ఇచ్చామని అన్నారు.విడిపోయినా తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని అన్నారు. |