Kingchoudary
Censor Bewarse Username: Kingchoudary
Post Number: 86176 Registered: 03-2004 Posted From: 130.138.227.40
Rating: N/A Votes: 0 | Posted on Monday, July 29, 2013 - 2:48 am: | |
అర్ధరాత్రి నడిరోడ్లపై 100 మంది యువకుల వీరవిహారం హెచ్చరించిన పోలీసులపై రాళ్లదాడికి దిగిన కుర్రకారు టైర్లు పేల్చేందుకు ఇన్స్పెక్టర్ కాల్పులు.. యువకుడి మృతి.. మరో యువకుడికి గాయాలు న్యూఢిల్లీ: అర్ధరాత్రి మోటారు బైకులతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ రోడ్లపై రెచ్చిపోతున్న కుర్రకారును నిరోధించేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. మరో యువకుడు గాయపడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని గోల్డాక్ ఖానా ప్రాంతంలో దాదాపు 100 మంది బైకర్లు 40 వరకూ బైకులతో ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారంటూ సమాచారం అందడంతో రెండు పీసీఆర్ వాహనాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్టంట్లు చేస్తున్న వారిని నిరోధించడం కోసం వారిని వెంబడించారు. అయితే విండ్సర్ ప్యాలెస్ ప్రాంతానికి వెళ్లగానే బైకులను ఆపిన కుర్రాళ్లు పోలీసులపైకి రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. అయినా వారు విన్యాసాలను కొనసాగిస్తూ రెచ్చిపోయారు. దీంతో పునీత్శర్మ అనే యువకుడి బైకు టైరు పగలగొట్టడానికి పోలీసులు కాల్పులు జరపగా, అతని వెనుక కూర్చున్న కరణ్పాండే(19) వీపులోకి బుల్లెట్ చొచ్చుకుపోయింది. వీరిద్దరినీ వెంటనే రామ్మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించగా కరణ్ మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. పునీత్కు చికిత్స అంది స్తున్నామన్నారు. బైక్ నడుపుతున్న సమయంలో పునీత్ తాగి ఉన్నట్లు పరీక్షల్లో తేలిం దని పోలీసులు చెబుతున్నారు. బైకర్ల దాడిలో పోలీసులు గాయపడ్డారని, తమ పీసీఆర్ వాహనం ధ్వంసమైందని డిప్యూటీ పోలీసు కమిషనర్ ఏబీఎస్ త్యాగీ తెలిపారు. టైరు పేల్చేందుకే ఇన్స్పెక్టర్ రజనీశ్ పర్మర్ కాల్పులు జరిపారని, కానీ అదే సమయంలో పునీత్ బైకుతో స్టంట్ చేయడంతో బుల్లెట్ పాండే వీపులోకి దూసుకుపోయిందన్నారు. మండిపడిన తల్లిదండ్రులు: పోలీసులు కాల్పులు జరపడాన్ని వారి కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘వీళ్లంతా చిన్నవాళ్లు. తప్పులు చేయడం సహజం. పోలీసులకు వీరి ప్రాణాలను తీసుకునే హక్కు లేదు’ అని పునీత్ తల్లి కుసుమలత మండిపడ్డారు. ‘నా ఒక్కగానొక్క కుమారుడిని కాల్చిచంపారు. లాఠీచార్జి చేసి ఉండాల్సింది లేదా అరెస్టు చేయాల్సింది. కానీ అతడిని కాల్చిచంపే హక్కు పోలీసులకు ఎక్కడిది? కాల్పులు జరిపిన పోలీసును ఉరితీయాలి’ అని కరణ్పాండే తల్లి మంజు డిమాండ్ చేశారు. తన కుమారుడికి బైక్ నడపడమే రాదని, అతడి మృతదేహానికి ప్రత్యేక వైద్య బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలన్నారు. 25లోపు వారే ఎక్కువ: ఢిల్లీలో చాలా మంది యువకులు నడిరోడ్లపై రాత్రిపూట స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, రోడ్లపై వెళ్లేవారికీ ప్రమాదాలు సృష్టిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిలో 25 ఏళ్లలోపువారే ఎక్కువగా ఉంటున్నారని, పోలీసులపై దాడిచేయడంతోపాటు మహిళలను వేధించడం వంటి సంఘటనలూ జరుగుతున్నాయని అంటున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో జరిగిన స్టంట్ల సీసీటీవీ ఫుటేజీలను వారు విడుదల చేశారు. |