Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 85811
Registered: 03-2004
Posted From: 130.138.227.41

Rating: N/A
Votes: 0

Posted on Friday, July 19, 2013 - 7:34 am:   

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం రాత్రి కంటతడి పెట్టారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద విజయమ్మ నిన్న ఉదయం ఫీజు పోరు దీక్ష ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం అది ముగుస్తోంది. రెండు రోజుల దీక్షలో భాగంగా నిన్న రాత్రి హైదరాబాదుకు చెందిన ములకలపల్లి రవి అనే కళాకారుడు అమ్మ పైన ఓ పాట పాడారు. ఆయన పాటకు విజయమ్మ చలించి, ఓ దశలో కంటతడి పెట్టారు. 'అమ్మంటే నీలా ఉండాలని ఆంధ్రదేశం అనుకుంటుందమ్మా..' అంటూ రవి దీక్షా శిబిరం వేదిక పైన పాడారు. ఈ పాట ఆసక్తిగా విన్న విజయమ్మ చలించిపోయారు. విజయమ్మనే కాకుండా దీక్షా శిబిరంలో ఉన్న వారు సైతం చలించిపోయారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ పలు కేసుల్లో చిక్కుకొని జైలుకు వెళ్లారు. ఆయన జైలుకు వెళ్లే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టారు. సీమాంధ్రలో టిడిపి, కాంగ్రెసు పార్టీకి ముచ్చెమటలు పోయించారు. ఆయన జైలుకు వెళ్లాక పార్టీని నడిపించే వారు లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయమ్మ, జగన్ సోదరి షర్మిల పార్టీలో ఉత్సాహం నింపి, ఉప ఎన్నికలలో గెలిపించిన బాధ్యతను తీసుకున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration