Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23721 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Saturday, July 13, 2013 - 6:31 am: | |
దామోదరరాజ నరసింహం ఈరోజు కోర్ కమిటీ ముందు సమైక్య వాదం వినిపించాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో,ఇప్పుడు మీరు ప్రతిపాదిస్తున్న రాయల తెలంగాణా వల్ల తెలంగాణా ప్రాంత దళితులకు,బలహీన వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది,మరల దొరల,పెత్తందార్ల చేతిలో మా బ్రతుకులు చితికిపోతాయి అని ,మరలా తెలంగాణా ప్రాంతములో తీవ్రవాద ప్రభావం హేచ్చుమీరి పోతుందని,దాని వలన యువతకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సోనియా,రాహుల్ గాంధీకి,ఆంటోనీ కి వివరించాడు.అది విని నివ్వెరపోయిన కోర్ కమిటీ . ఇప్పుడు నడుస్తున్న ఉద్యమములో ఆశువులుబాసింది పేదలు,దళితులూ,బడుగు బలహీన వర్గాలే అని,ఒక్క అగ్రవర్నాలలోని వారు కానీ,ఏ ఒక్క తెలంగాణా నాయకుని బంధువు కానీ ప్రాణాలు పోగొట్టుకోలేదని,ఇదంతా రెడ్డి కులస్తులు, వెలమ కులస్తులు,బ్రాహ్మల్లోని ఒక కులమైన కరణాలు చేరి ఇదంతా నడుపుతున్నారని సోనియా కు,రాహుల్ కు సవివరముగా గణాంకాలతో సహా 120 పేజీల నివేదిక అందజేశాడు. తెలుగు మీడియా కూడా కావాలని అగ్రవర్ణాల వారినే ఉద్యమ నాయకులుగా చూపిస్తూ దళిత,బడుగు బలహీన వర్గాల వారిని పట్టించు కోవడములేదని,వారిని ఉద్యమానికి ముడిసరుకుగా వాడుకుంటోందని వివరించాడు.తెలుగు మీడియాని నియంత్రించాల్సిన తక్షణ అవసరం ఉన్నదని,ప్రత్యేకముగా విభజన కోసం మాత్రమె పనిచేస్తున్న వాటిని రద్దు చెయ్యాలని విన్నవించాడు. తెలంగాణా రాష్ట్రము బదులుగా,ఇప్పుడు తెలంగాణా ప్రాంతానికి చెందిన ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిగా చెయ్యమనీ,ఆ పదవి నాకు అవసరములేదని చెప్పాడు.ఈ పరిణామముతో ఆజాద్ .ముఖ్యమంత్రి,బొత్స నివ్వెరపోయారు.షిండే ,ఆంటోనీ ,రాజ నరసింహం కు మద్దత్తు తెలిపారు. space for lease
|