Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23626 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Monday, July 08, 2013 - 6:50 am: | |
న్యూఢిల్లీ: తెలంగాణపై రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కొత్త వ్యాఖ్య చేశారు. విభజన, సమైక్యాంధ్రల పైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను అడిగామని, వారు నివేదిక ఇచ్చాకనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు. కిరణ్, దామోదర, బొత్సలు నివేదిక ఇవ్వడానికి ఓ గడువు అంటూ ఏమీ లేదని చెప్పారు నేతలు ఎప్పుడైనా వచ్చి తమ నివేదికను తమకు ఇవ్వవచ్చునని చెప్పారు. అయితే వారు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందన్నారు. నేతలు ఇచ్చే నివేదికకు గడువు లేదని చెప్పడం ద్వారా దిగ్విజయ్ తెలంగాణపై కొత్త మెలిక పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి విద్యార్థులు ఈ రోజు డిగ్గీని కలిశారు. space for lease
|