Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23129 Registered: 08-2004 Posted From: 130.233.204.18
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, May 15, 2013 - 3:56 am: | |
ఎవరు..? ఎక్కడి నుండి పోటీ? ఈ క్రమంలో గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ అసెంబ్లీ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించడం వెనుక బలమైన కారణం ఉందంటున్నారు.2009 నుండి మొన్నటి ఉప ఎన్నిక వరకు రెండు సార్లు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ నుండి స్థానికంగా ఉన్న వారిని కాదని షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన ముస్లిం నేతకు కేసిఆర్ టిక్కెట్ ఇవ్వడాన్ని మహబూబ్నగర్ ఓటర్లు తిరస్కరించారని గౌడ్ ప్రచారం చేసుకుంటున్నారు. అదే తనకే టిక్కెట్టు ఇస్తే టీఆర్ఎస్ ఖాతాలో ఒక సీటును నమోదు చేసుకున్న వారవుతారని చెబుతున్నట్లు సమాచారం. అయితే కేసిఆర్ ఈ సారి కూడా మళ్లీ షాద్నగర్కు చెందిన ముస్లిం అభ్యర్థి వైపే మొగ్గు చూపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ నల్గొండ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు సీటు అయిన తుంగతుర్తిలో పోటీకి సై అంటున్నారు. డాక్టర్ల జేఏసీ నేత డా. నర్సయ్య భువనగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరగుతోంది. తెలంగాణ లెక్చరర్ల ఫోరం నేత కత్తి వెంకట స్వామి కూడా వరంగల్ జిల్లాలో ఏదైనా నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారని సమాచారం. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ రాజేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ విద్యావంతుల వేదిక ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య కూడా ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నారని సమాచారం. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పార్లమెంటు స్థానంపై ఆయన దృష్టి సారించారని అంటున్నారు. కాకా, కేకేపై తరుచూ విరుచుకు పడుతున్న మల్లేపల్లి ఈ సారి ప్రజా క్షేత్రంలోనే తన సత్తా చాటుకునేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఇక పోతే తెలంగాణ ఉద్యమానికి చుక్కానిగా ఉంటూ ఆట పాటలతో అందర్ని అలరిస్తు తెలంగాణ ధూం ధాంను నిర్వహిస్తున్న రసమయి బాలకిషన్ 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డారు. దొర అయిన కేసిఆర్ దొరలకు, రెడ్లకే టిక్కెట్లు ఇచ్చారని ఏకంగా టీవీ చర్చా వేదికలకు ఎక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి అయిన కేసిఆర్ తనను కరుణిస్తారా? లేదా అన్న సంశయంలోనే రసమయి ఉన్నట్లు తెలుస్తోంది.కేసిఆర్ ఇంత మందికి టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేక పోతే మరి అప్పుడేం చేయాలన్న అంశంపైనా జాక్ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారని సమాచారం. కేసిఆర్ కాక పోతే జేఏసీ ఛైర్మన్ కోదండరామిరెడ్డితో పార్టీ పెట్టించి ఆ పార్టీ నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశమూ జేఏసీలో చర్చకు వస్తున్నట్లు సమాచారం. ఉద్యమాన్ని వెనక్కి నెట్టి ఎన్నికల్లో పోటీ పై ఆసక్తి చూపుతూ ముందుకు వెళ్తుంటే జేఏసి ఉంటుందా? ఉండదా? అన్న ప్రశ్నకూడా ఉత్పన్నమవుతోంది. కేసిఆర్ టిఆర్ఎస్ టిక్కెట్లు ఇస్తే సరే సరి అని.. ఇవ్వక పోతే కోదండరాంతో పార్టీ పెట్టించి ఎన్నికల బరిలో తాము నిలవడం ఖాయమని ఈ నేతలు కుండబద్దలు కొడుతున్నట్లు సమాచారం. space for lease
|