Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6456 Registered: 03-2004 Posted From: 76.122.134.43
Rating: N/A Votes: 0 | Posted on Saturday, April 20, 2013 - 4:44 pm: | |
కువైట్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను కువైట్ లోని మలియా ప్రాంతములో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కువైట్ సభ్యులు 50 కేజీల కేక్ కట్ చేశారని కువైట్ కో ఆర్డినేటర్ ఇలియాస్ తెలిపారు. మలియా ప్రాంతములో 1000 మందికి అన్నదానం చేశామని పేర్కొన్నారు. కువైట్ లో వైఎస్ కుటుంబం అంటే ప్రత్యేక అభిమానం ఉందని, వైఎస్సార్ పార్టీ రాష్ట్రంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని కువైట్ లోనూ జరపడమే దీనికి నిదర్శనమన్నారు. సభ్యులు మాట్లాడుతూ... కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణం పోశారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి రాజకీయ కక్షతో వైఎస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ప్రవాసులు హామీయిచ్చారు. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=583467&Categoryid=14&subcati d=0#sthash.xUHdvaOO.dpuf |