Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Bewarse Legend
Username: Kingchoudary

Post Number: 82073
Registered: 03-2004
Posted From: 192.26.169.94

Rating: N/A
Votes: 0

Posted on Thursday, February 28, 2013 - 2:50 am:   

అద్దంకి రాజకీయం రసవత్తరం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఒంగోలు,ఫిబ్రవరి 25

అద్దంకి నియోజకవర్గ రాజకీయం రసవ త్తరంగా మారనుంది. సరికొత్త సమీకరణలకు తెరలే చింది. తెదేపా నాయకుడు కరణం బలరాం తనయుడు వెంకటేష్ పాదయాత్ర చేపట్టడమే రాజకీయ వర్గాల్లో వేడి పు ట్టించగా, శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ వైసీపీ అధినేత జగన్‌ను కలవడం, ఆయన పార్టీలోకి చేర్చుకుని అద్దంకి నియోజకవర్గం లో పనిచేయాలని సూచించడం తాజాగా సంచలనమైంది.

ఈ పరిణామం ప్ర త్యేకించి సీనియర్ నాయకుడు, అద్దంకి నియోజకవర్గంలో అంతో ఇంతో సొంత బలం ఉన్న డాక్టర్ బాచిన చెంచు గర టయ్య రాజకీయ భవితవ్యంపై అను మానాలను రేకెత్తిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొత్త వారిని నియమించి పవర్ ప్రతా పాన్ని చూపాలని యోచిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో నాయకుల వ్యూహా లు, ప్రతివ్యూహాలతో అద్దంకి రాజకీ యం మలుపులు తిరిగే అవకాశం కన్పిస్తోంది.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికు మార్ సోమవారం చంచల్‌గూడ జైల్లో వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఆయ న రవికుమార్‌ని పార్టీలోకి తీసుకోవడం తోపాటు, అద్దంకి నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించినట్లు తెలి సింది. ఆ విషయాన్ని రవికుమార్ కూ డా స్పష్టంగా ప్రకటించారు. దీంతో రవి కుమార్ వెంట ఉన్న కాంగ్రెస్ వాదుల్లో ఎంత మంది వైసీపీలోకి వెళ్తారు? ఇప్ప టికే అద్దంకి టిక్కెట్‌ను ఆశించి ఆ పార్టీ లో ఉన్న డాక్టర్ గరటయ్య ఎలాంటి రాజకీయ వైఖరిని అవలంబిస్తారు? అనే ది చర్చనీయాంశమైంది. నిజానికి రవికు మార్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనప్పటి నుంచి డాక్టర్ గరటయ్య అద్దంకి టిక్కెట్ నాకు ఇచ్చేందుకు జగన్ హామీ ఇచ్చా రంటూ ప్రచారాన్ని చేసుకున్నారు.

ఆవిషయాన్ని అటుంచితే భవిష్యత్‌లో ఎమ్మెల్సీగా గెలిపిస్తామని హామీ ఇవ్వ డం ద్వారా గరటయ్యను దూరం చేసు కోకూడదన్న భావన జగన్‌లో ఉన్నట్లు తెలిసింది. గరటయ్యను వదులుకోవాల నుకుంటే ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామన్న హామీని ఆయనకు ఇవ్వాల్సిన అవసరం లేదు. శాసనమండలికి పంపిస్తామన్న హామీని కూడా ఆ పార్టీలో కీలకమైన నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి ఇవ్వడం విశేషం. అదే సమయంలో సోమవారం తనను కలిసిన రవికుమార్‌కు అద్దంకి నియోజకవర్గంలోనే పనిచేసుకోమం టూ జగన్ సూచించడం విశేషం. దీంతో రవికుమార్ వెంట వైసీపీలోకి కాంగ్రెస్ నాయకులు ఎంత మంది వెళ్తారనే విష యంతోపాటు, డాక్టర్ గరటయ్య భవిష్య త్ రాజకీయ పోకడ ఏమిటనేది చర్చనీ యాంశమైంది.

తొలి అంశాన్ని పరిశీలిస్తే ఇప్పటికే నియోజకవర్గంలోని ఆయా మండలా ల్లో ఉన్న ముఖ్య నాయకులు ఎవరు రవికుమార్‌తో వెళ్తారో? ఎవరు కాంగ్రెస్ లో ఉంటారో? అనే విషయం ఇప్పటికే వెల్లడైంది. గ్రామస్థాయిలో కూడా ఆ విషయంపై కాంగ్రెస్, వైసీపీల మధ్య స్పష్టత ఏర్పడింది. అందుకు ఇటీవల జ రిగిన సహకార ఎన్నికలు కూడా కొంత దోహదపడ్డాయి. మండలాల వారీ చూ స్తే అద్దంకి మండలంలో సీనియర్ నా యకుడు సందిరెడ్డి శ్రీనివాసరావు కాం గ్రెస్‌లో ఉండగా, ఆయన సోదరుడు రమేష్ మాత్రం రవికుమార్ పక్షాన సహకార సొసైటీ అధ్యక్షుడిగా గెలుపొం దారు. భవిష్యత్‌లో కూడా కాంగ్రెస్‌లో నే ఉంటానని శ్రీనివాసరావు ప్రకటిస్తు న్నప్పటికీ ఎన్నికల నాటికి ఆయన రవి కుమార్ పక్షాన చేరినా అశ్చర్యపోవా ల్సిన అవసరం లేదన్న ఊహాగానాలు న్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న అ ద్దంకి సర్పంచ్ విషయంలోనూ రాజకీ య నాయకుల్లో అలాంటి అనుమానా లు లేకపోలేదు. వారిద్దరితోపాటు బల్లికు రవ మండలంలోని ముఖ్య నాయకుల్లో గుర్రం రంగారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఏడు కొండలు తదితరులు కాంగ్రెస్‌వైపునే ఉన్నారు. సంతమాగు లూరు మండలంలో మార్టూరు ఏఎంసీ చైర్మన్ రామకృష్ణ, జె. పంగులూరు మండల పార్టీ అధ్యక్షుడు హనుమంత రావు, కొరిశపాడు ఏఎంసీ మాజీ చైర్మన్ రవి, తదితరులు కాంగ్రెస్‌తోనే ఉండే అవకాశం కన్పిస్తోంది. నియోజకవర్గ స్థాయిలో సీనియర్ నాయకుడైన జాగ ర్లమూడి రాఘవరావు కాంగ్రెస్‌లోనే ఉండటంతోపాటు, సహకార ఎన్నికల్లో తనకున్న ప్రజామద్దతును అధికార పార్టీ మద్దతుదారుల గెలుపుకోసం ఉపయో గించారు కూడా.

ఇక రవికుమార్‌తో పాటు వైసీపీలో చేరే నాయకుల్లో అద్దంకి ఏఎంసీ చైర్మన్ కోటిరెడ్డి, సీనియర్ నాయుడు కర్రి వెంక టసుబ్బారావు, కర్రి పరమేష్, సందిరెడ్డి రమేష్, పి. సుబ్బారావు, రామారావు, శేషిరెడ్డి, రమణయ్య, అంజిరెడ్డి తదితర నాయకులు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇంతకాలం రవికుమార్ వెంట కాం గ్రెస్‌లో చలామణి అయిన నాయకుల్లో 80శాతం మందికి పైగా వైసీపీలో చేర నున్నారు. మిగిలిన 20శాతం మందిలో కడవరకూ కాంగ్రెస్‌లోనే ఉండేవారు ఎవరనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలతో రవి వర్గీయులు సమన్వ యంతో పోతారా?లేదా? అనేది తేలాల్సి ఉంది. వారందరినీ సమన్వయం చేసు కోగలనన్న నమ్మకం రవికుమార్‌లో ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం కన్పి స్తోంది. వీటన్నింటికీ మించి గరటయ్య భవిష్యత్ రాజకీయ వ్యూహం నియోజక వర్గ రాజకీయాల్లో కీలకమయ్యే అవకాశం ఉంది.

జిల్లాలోనే సీనియర్ నాయకుడైన గరటయ్య ముందుచూపుతోనే వైసీపీలో చేరారు. అద్దంకి టిక్కెట్ విషయంలో జగన్ నుంచి స్పష్టమైన హామీ ఉందం టూ ప్రచారం చేసుకున్నారు. వివిధ ర కాలుగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆ పార్టీలో చేరా రు. జగన్ కానీ, ఇతర నాయకులు కానీ బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో అద్దంకి టిక్కెట్ రవికే అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విష యంలో గరటయ్య తనకే టిక్కెట్ అం టూ ఇటీవల మరింత విశ్వాసాన్ని ప్రక టించారు. అయితే వైసీపీ నాయకుడు వై.వి. సుబ్బారెడ్డి అలాంటి హామీ ఇవ్వ కపోవడం, రవికుమార్‌ను పార్టీలో చేర్చుకునే సందర్భంలో గరటయ్యను పిలిచి ముందుగా జగన్ మాట్లాడకపో వడం తదితర అంశాలను పరిశీలిస్తే గరటయ్యకు టిక్కెట్ విషయంలో పరిశీ లకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో గరటయ్య భవిష్యత్ పోకడ ఎలాంటి ఉండబోతున్నదన్నది చర్చనీయాంశమైంది.

జగన్‌పై ఉన్న అపారమైన నమ్మ కంతో ముందుకు గరటయ్య ముందుకు సాగుతారా? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీయే ప్రధానంగా భావించి సరికొత్త రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఆయన తీసుకునే నిర్ణయం అద్దంకి నియోజకవర్గంలో రాజకీయంపై ప్రభా వం చూపించే అవకాశం లేకపోలేదు. ఈ అంశాలన్నింటినీ సొమ్ము చేసు కునేందుకు తెదేపా నాయకులు కాచు కూర్చున్నారు. వ్యూహాత్మకంగా పా వులు కదుపుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో అద్దంకి రాజకీయాల్లో ఊహిం చని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ....

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration