Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 21755 Registered: 08-2004 Posted From: 91.152.96.187
Rating: N/A Votes: 0 | Posted on Friday, February 01, 2013 - 11:58 am: | |
కాంగ్రెస్ పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్యెల్యేల బహిష్కరణ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటన హైదరాబాద్, ఫిబ్రవరి 1 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పంచన చేరిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రకటించారు. తొమ్మది మందిలో ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లుపై స్పష్టత ఉండగా మరో ఇద్దరు ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బహిష్కరణకు గురైన శాసనసభ్యులు... ఆళ్ళనాని, గొట్టిపాటి రవి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, సుజయ కృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, మద్దాల రాజేష్, పేర్ని నాని, బూచేపలి శివప్రసాద్రెడ్డి తదితరులు. జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన తొమ్మిది మంది శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ వేటు వేసింది. ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రకటించారు. జగన్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేలను తాము పార్టీ నుండి బహిష్కరించామని ఆయన చెప్పారు. డబ్బుల కోసం ఇతర నేతలకు అమ్ముడుపోయిన, వ్యక్తిత్వం లేని వారిని తాము పట్టించుకోమన్నారు. నేతల తీరుపై తాము తెలుగుదేశం పార్టీలో పూటకోమాట మాట్లాడమని చెప్పారు. రాజీనామాలు చేసిన వారి గురించి సభాపతి నాదెండ్ల మనోహర్ చూసుకుంటారన్నారు. అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని బొత్స చెప్పారు. సహకార ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చినందు వల్లే కాంగ్రెసు ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటుందంటున్నారు. కాగా జగన్ వైపు ఇటీవల పలువురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు వెళ్లిన విషయం తెలిసిందే. వారి పైనే వేటు వేసినట్లు బొత్స చెప్పారు. space for lease
|