Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 845 Registered: 05-2017 Posted From: 54.172.59.33
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 18, 2018 - 6:46 pm: | |
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను నిబంధలకు విరుద్ధంగా గవర్నర్ వాజూభాయ్ వాలా నియమించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్తో కూడిన కాంగ్రెస్ న్యాయవాదుల బృందం రాత్రి 8 గంటల ప్రాతంలో సుప్రీంకోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని తమ పిటిషన్ను రిజిస్ట్రార్కు అందజేసింది. దీనిపై తక్షణ విచారణ జరపాలని న్యాయవాదుల బృందం ఆ పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్ సీజేఐ కార్యాలయానికి చేరడంతో సీజేఐ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. |