Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 801 Registered: 05-2017 Posted From: 107.77.76.111
Rating: N/A Votes: 0 | Posted on Thursday, February 22, 2018 - 7:24 pm: | |
http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break9 Naa dari rahadari ante iddaru telugu heavy weights jarigi choticharu ga. Lol. ఇంటర్నెట్డెస్క్: ఒకరు కొబ్బరికాయ కొట్టిన రోజే విడుదల తేదీ ప్రకటించామన్నారు. మరొకరు సినిమా ప్రకటించిన రోజే వెల్లడించామన్నారు. మధ్యలో రజనీకాంత్ వచ్చి నేనూ అదే రోజు వస్తానని అన్నారు. గత కొంత కాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆసక్తిని నెలకొల్పిన తేదీ ఏప్రిల్ 27. ఈ తేదీ విషయంలో రజనీ ‘2.ఓ’ వెనక్కి తగ్గినా, ‘భరత్ అనే నేను’, ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్ర బృందాలు మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. తాజాగా దానికి తెరపడింది. మహేష్బాబు-కొరటాల శివ కలయికలో వస్తున్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుదల కానుండగా, అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్లో వస్తున్న ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న విడుదల చేయాలని నిర్ణయించారు. గురువారం ఇరు చిత్రాల నిర్మాతల కూర్చొని సినిమా విడుదల తేదీ విషయంలో చర్చించి కొత్త తేదీలను ఖరారు చేశారు. రెండు చిత్రాల విడుదల మధ్య రెండు వారాల గ్యాప్ ఉండాలని నిర్ణయించారు. మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కైరా అడ్వాణీ కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. ‘శ్రీమంతుడు’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మహేష్బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. జనవరి 26న ‘ఫస్ట్ ఓథ్’ పేరుతో విడుదల చేసిన మహేష్ ప్రమాణ స్వీకారం ప్రసంగం అభిమానులను ఆకట్టుకుంది. దీంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 20న విడుదల చేయాలని తాజాగా నిర్మాత నిర్ణయించారు. ఇక అల్లు అర్జున్ కథానాయకుడిగా వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఇందులో బన్ని ఆర్మీ అధికారిగా కనిపించనున్నారు. సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆయన ‘ఫస్ట్ ఇంపాక్ట్’తో అదరగొట్టేశారు. తొలుత చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27 విడుదల చేయాలని నిర్ణయించినా, తాజాగా మే 4కు వాయిదా వేశారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా, శ్రీధర్ లగడపాటి, బన్ని వాసులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్-శేఖర్ ద్వయం సంగీతం అందిస్తోంది. మరోపక్క రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ ఏప్రిల్ 27 పోటీ నుంచి ముందే వెనక్కి తగ్గగా, ఆ తేదీలోకి ‘కాలా’ వచ్చి చేరింది. పా రంజిత్ దర్శకత్వంలో రజనీ నటించిన చిత్రమిది. ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చిత్ర బృందం యోచిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వండర్బార్స్ పతాకంపై ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. |