Winner
Pilla Bewarse Username: Winner
Post Number: 662 Registered: 05-2017 Posted From: 54.172.120.200
Rating: N/A Votes: 0 | Posted on Monday, October 16, 2017 - 8:43 am: | |
http://www.eenadu.net/homeinner.aspx?category=politics&item=break69 దిల్లీ: ప్రముఖ చారిత్రక కట్టడం, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇటీవల ఉత్తర్ప్రదేశ్ విడుదల చేసిన టూరిజం బుక్లెట్లో తాజ్మహల్ పేరును ప్రచురించకపోవడంతో వివాదానికి తెరలేచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ భాజపా నేత ఈ కట్టడంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత సంస్కృతికి తాజ్మహల్ ఓ మాయని మచ్చ లాంటిదని యూపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ అన్నారు. ‘యూపీలోని చారిత్రక కట్టడాల జాబితా నుంచి తాజ్మహల్ను తొలగించడంపై చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. చరిత్ర గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాం? తాజ్మహల్ను నిర్మించి వ్యక్తి(షాజహాన్) తన తండ్రిని జైల్లో పెట్టాడు. హిందువులనే లేకుండా చేయాలనుకున్నాడు. అలాంటి చరిత్రను మేం మారుస్తాం’ అని సోమ్ అన్నారు. యూపీలో భాజపా ఆరు నెలల పాలన ముగిసిన సందర్భంగా ఇటీవల పర్యాటక ప్రాంతాలతో ఓ బుక్లెట్ విడుదల చేశారు. అయితే అందులో తాజ్మహల్ పేరు లేకపోవడంపై వివాదం రేగింది. దీంతో స్పందించిన రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్ నాథ్ సమాచార లోపం వల్లే ఈ తప్పిదం జరిగిందని అన్నారు. రాష్ట్ర పర్యాటక మంత్రి రిటా బహుగుణ జోషి స్పందిస్తూ.. తాజ్మహల్ చారిత్రక వారసత్వ సంపద అని, ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో స్థానం సాధించిన గొప్ప కట్టడం అని అన్నారు. |