![Top of page](http://www.bewarsetalk.net/discus/icons/mark_top.gif) ![Previous message](http://www.bewarsetalk.net/discus/icons/mark_up.gif) ![Next message](http://www.bewarsetalk.net/discus/icons/mark_down.gif) ![Link to this message](http://www.bewarsetalk.net/discus/icons/tree_m.gif)
Fanno1
Mudiripoyina Bewarse Username: Fanno1
Post Number: 10220 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, September 27, 2017 - 10:07 pm: | |
this looks interesting... ఇక ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకోవాలి పలు ప్రామాణికాల నిర్దేశం అన్ని కేంద్రీయ సంస్థలకు వర్తింపు ‘నీతి’ సిఫారసుకు ప్రధాని ఆమోదం న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇకపై ఏ రాష్ట్రానికీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రాజెక్టులను మంజూరు చేయబోదు! ‘చాలెంజ్’ పద్ధతిలో రాష్ట్రాలే పోటీ పడి సాధించుకోవాలి! ఏదైనా కేంద్రీయ విద్యా సంస్థనో... వైద్య సంస్థనో... రక్షణ సంస్థల వంటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించగానే రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవలసిందే. అన్ని అర్హతలు సాధించి కేంద్రం పరిగణనలోకి తీసుకునే ప్రామాణికాల్లో ఏ రాష్ట్రం ఎక్కువ మార్కులు సాధిస్తే ఆ రాష్ట్రానికే ప్రాజెక్టు దక్కుతుంది. రాజకీయ కారణాలతో రాష్ట్రాలకు ప్రాజెక్టులను మంజూరు చేయవద్దని, ప్రాజెక్టును నిలుపుకునే సామర్థ్యం ఉన్న రాష్ట్రాలకే ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని నీతీ ఆయోగ్ సిఫారసు చేసింది. దాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారు. రెండు రోజుల్లో మార్గదర్శకాలను విడుదల చేస్తామని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆరు లేదా ఏడు ప్రామాణికాలను ఖరారు చేసి, వాటికి మార్కులు కేటాయిస్తారు. ఏ రాష్ట్రం ఎక్కువ మార్కులు సాధిస్తే ఆ రాష్ట్రానికి ప్రాజెక్టులు దక్కుతాయి. విమానయానం, రోడ్డు, రైల్వే, వైద్య, విద్య, ఐటీ, విద్యుత్తు, టెక్స్టైల్ తదితర రంగాలతో పాటు ఐఐటీ, నిట్, ఐఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి సంస్థలు, థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను కూడా ఈ విధానానికి లోబడే మంజూరు చేయనుండడం విశేషం. ఈ వి ధానంతో రాష్ట్రాల మధ్య పోటీతత్వం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, వెనుకబడిన రాష్ట్రాలు నష్టపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు ఇలా... దేశంలో ఒక ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నామని కేంద్రం ప్రకటిస్తుంది. అన్ని రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపించాలి. వాటిని పరిశీలించి ప్రామాణికాల ఆధారంగా మార్కులు వేస్తారు. మొత్తం 100 మార్కులకు అత్యధిక మార్కులు సాధించే రాష్ట్రానికి సదరు ఐటీ పార్కు దక్కుతుంది. ఆ ప్రామాణికాలు... వాటికి గరిష్టంగా ఇచ్చే మార్కులు ఇలా ఉంటాయి. మార్కులు అనువైన భూమి కేటాయింపు 25 మౌలిక సదుపాయాల కల్పనకు 20 సింగిల్ విండో అనుమతులకు 15 మానవ వనరుల లభ్యతకు 15 రాష్ట్రం కల్పించే సౌకర్యాలు 10 ఆర్థిక తోడ్పాటుకు 10 ప్రాజెక్టుతో స్థానిక అవసరాలకు 5 |