Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8396 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Monday, February 08, 2016 - 5:43 pm: | |
కవాడిగూడ: కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులకు ఏమైనా జరిగితే అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బీసీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ దీక్షకు సంఘీభావంగా కాపు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (కేజేఏసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం రిలేదీక్షలు చేపట్టారు. వీహెచ్ ముఖ్యఅతిథిగా పాల్గొని దీక్షను ప్రారంభించారు. ముద్రగడ దంపతుల దీక్షను అణచి వేయాలని చూస్తే ఉద్యమం ఏపీలోని అన్ని జిల్లాలకు విస్తరి స్తుందని హెచ్చరించారు. కాపుల డిమాండ్ న్యాయ మైనదని... వారికి తన మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కాపులు అన్ని జిల్లాలో రిలే దీక్షల క్యాంపులు నిర్వహించి ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జేఏసీ నాయకులు కటారి అప్పారావు, అద్దెపల్లి శ్రీధర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, మైరా శేషాద్రినాయుడు, రత్నం, ప్రతా్పలు మాట్లాడుతూ, ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్షను భగ్నం చేయాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో జేఏసీ నాయకులు బైర శేషాద్రినాయుడు, మారాబత్తిని బ్రహ్మనాయుడు, వెండి వేణుబాబు, చవ్వాకుల పేరయ్య, డి.వి.రావు, సత్యనారాయణ, బండారు సత్యనారాయణ, రమణ, రాంచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. |