Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8179 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, November 10, 2015 - 6:58 pm: | |
ప్రస్తుత పీపీఏ వల్ల ప్రజలపై మోయలేని భారం ఈఆర్సీని కోరిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం హైదరాబాద్, ఆంధ్రజ్యోతి: ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ప్రజా విచారణ నిర్వహించాలని తెలంగాణ ఈఆర్సీని టీ జేఏసీ చైౖర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ప్రస్తుత ఛత్తీ్సగఢ్ విద్యుత్కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లోని షరతుల వల్ల తెలంగాణ వినియోగదారులపైనా, ప్రభుత్వంపైనా మోయలేని భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ సంఘాల నేతలతో కలిసి కోదండరాం మంగళవారం టీ ఈఆర్సీ చైర్మన్ను కలిశారు. ఛత్తీ్సగఢ్ పీపీఏపై ప్రజా విచారణ నిర్వహిస్తే బహిరంగంగా చర్చ జరిగి మేలు జరుగుతుందంటూ కోదండరాం ఈఆర్సీ చైర్మన్కు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర విద్యుత్చట్టంలోని సెక్షన్ 86(3) ప్రకారం ఈఆర్సీ పారదర్శకంగా బాధ్యతలు నిర్వహించాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వినియోగదారులపై ఆర్ధిక భారం పడే నిర్ణయాలకు ముందు ప్రజా విచారణ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈఆర్సీ చైర్మన్ను కలిసినవారిలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, అడ్వొకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఎంపీజే అధ్యక్షుడు ఖాజా మోయినుద్దీన్, టీజాక్ సమన్వయకర్త కె.రఘు ఉన్నారు. |