Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 8167 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Saturday, November 07, 2015 - 8:15 pm: | |
btw..Bangaru telangana lo idee paristhiti.. కడియంపై చెప్పు విసిరిన కౌలు రైతుకు రిమాండ్ ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి సెంట్రల్ జైలుకు తరలింపు బెయిల్ బాధ్యత మాదే: బీజేపీ నేతలు శాయంపేట: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిపైకి చెప్పు విసిరిన కౌలు రైతు దామెరకొండ కొమురయ్యను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. కొమురయ్యపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం అతడిని పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. వరంగల్ జిల్లా, శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై కొమురయ్య చెప్పు విసిరన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత కొమురయ్యను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. విచారణ తర్వాత అతడిపై ఐపీసీ 447, 341, 352, 353, 504 సెక్షన్ల కింద నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు. శనివారం మధ్యాహ్నం పరకాల సివిల్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి జీవన్కుమార్ రెండువారాల రిమాండ్ విధించారు. కాగా, కొమురయ్యను విడిపించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్రెడ్డిలతో పాటు పలువురు శనివారం పోలీ్సస్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రశ్నించిన రైతులపై టీఆర్ఎస్ కేసులు పెట్టడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కొంరయ్యను బెయిల్పై విడుదలయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా కొడుకును విడిపించండి బాంచెన్ కొంరయ్యను విడిపించాలంటూ అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శనివారం ఉదయం పోలీస్ స్టేషన్కు చేరుకున్న దామెరకొండ సాంబలక్ష్మి, చంద్రయ్య దంపతులు కనపడిన ప్రతి నాయకుడి కాళ్ల మీదా పడుతూ.. వేడుకున్నారు. కొంరయ్యకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించిన టీడీపీ, బీజేపీ నాయకుల కాళ్ల మీద పడి కొంరయ్య తల్లి రోదించింది. కొంరయ్య 3 క్వింటాళ్ల పత్తిని అమ్మిన తర్వాత మార్కెట్ నుంచి నేరుగా సమావేశానికే వెళ్లాడని తల్లిదండ్రులు తెలిపారు. వారి గోడును విన్న నాయకులు కొంరయ్యను విడిపించే బాధ్యత తమదేనని ఓదార్చారు. |