Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8165
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Saturday, November 07, 2015 - 8:09 pm:   

ప్రచారంలో ఎదురొచ్చి నిలదీస్తున్న ప్రశ్నలు
ఈసారి మంత్రి హరీశ్, పల్లా రాజేశ్వర్‌ వంతు

కరెంటేదీ? చెరువులో నీళ్లేవి?.. ఇచ్చిన హామీలూ నెరవేర్చరా?.. మంత్రిని నిలదీసిన రైతు మోర్తాల మహేందర్‌ అడ్డుకుని బయటకు పంపించిన కార్యకర్తలు, పోలీసులు.. వాళ్లు అడుగుతున్నారు.. చెప్పడం మన బాధ్యత: హరీశ్ మీ పథకాలు అందట్లేదు.. చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఎమ్మెల్సీ పల్లాపై మరో రైతు ఆగ్రహం.. పంపించిన పోలీసులు

రఘునాథపల్లి రూరల్‌, నవంబరు 7: మొన్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. నిన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. నేడు మంత్రి హరీశరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌! వరంగల్‌ ఉప ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఇచ్చిన హామీలపై జనం వారిని ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీల ఊసేదీ అంటూ జనం వారిని నిలదీస్తున్నారు. వరంగల్‌ జిల్లా స్టేషన ఘనపూర్‌ నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండల కేంద్రంలో శనివారం
నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న హరీశకు ఇదే సీన ఎదురైంది. సభలో మంత్రి హరీశ మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా.. ‘మా చెరువులోకి గోదారి నీళ్లు ఎప్పుడు తెస్తారో చెప్పండి’ అంటూ ఓ గొంతుక నుంచి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వేసింది ఇబ్రహీంపురం గ్రామానికి చెందిన మోర్తాల మహేందర్‌ అనే రైతు. హరీశ వద్దకు వచ్చిన అతడు.. ‘‘రైతాంగానికి పగటి పూట కరెంటు ఇస్తామని చెప్పారు. కానీ కరెంట్‌ రావట్లేదు. రాత్రిపూట మాత్రమే ఇస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్‌ను పగటిపూట మాత్రమే ఇవ్వాలి. నెలరోజుల్లో చెరువులన్నింటినీ నింపుతామని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. అయినా మా చెరువులు నేటికీ నీటితో నిండలేదు. ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదు. ఇదేనా పాలన?’’ అని మంత్రి హరీశను మహేందర్‌ నిలదీశాడు. అయితే అదే సమయంలో టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మారుజోడు రాంబాబు జోక్యం చేసుకుని అడగడానికి ఇదేనా సందర్భం అంటూ మహేందర్‌తో గొడవకు దిగాడు. దీంతో హరీశ కల్పించుకుని ‘‘వాళ్లు అడుగుతున్నారు. అడగడం తప్పు కాదు కదా’’ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై కచ్చితంగా ఉంది అంటూ మహేందర్‌ను శాంతింపజేశారు. అప్పటికే అతడిని పోలీసులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడి నుంచి పక్కకు పంపించారు. ఇక, అంతకుముందు ఎమ్యెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయి కదా? అంటూ ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. వెంటనే రఘునాథపల్లి గ్రామానికి చెందిన సిరిగిరి ఉప్పలయ్య అనే వ్యక్తి స్పందించారు. ‘‘మీ పథకాలు ఎవరికీ అందడం లేదు. చెప్పేది ఒకటి.. చేసేదొకటి’’ అంటూ పెద్దగా గొంతెత్తి అరిచాడు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు అతడిని అక్కడి నుంచి పంపించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration