Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7970
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Monday, October 05, 2015 - 9:49 pm:   

16 ఎకరాల సాగర్‌ కాల్వ భూమి కబ్జా..
ఆర్డీవో సంతకం ఫోర్జరీతో ఎన్‌వోసీ సృష్టి
నకిలీ పత్రాలతో సర్కారు భూమికి రిజిస్ట్రేషన్‌
నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల తీరు

(ఆంధ్రజ్యోతి, నల్లగొండ)
నిన్నటి వరకు పైరవీలు, పోస్టింగ్‌లతో కాసులు వెనకేసుకున్న టీఆర్‌ఎస్‌ నేతలు నేడు కోట్లు విలువ చేసే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు భూములపై దృష్టిసారించారు. ఏకంగా ఆర్డీవో సంతకాన్నే ఫోర్జరీ చేసి, నకిలీ ఎన్‌వోసీ సృష్టించి 16 ఎకరాలను మింగేశారు. దాంతోపాటు దళితులకు దక్కాల్సిన 1.5 ఎకరాల భూమినీ కబ్జా చేశారు.
నల్లగొండ జిల్లా అల్వాల పంచాయతీ పరిధిలో సాగర్‌ కెనాల్‌కు సంబంధించి 18 ఎకరాల 6 గుంటల భూమి ఉంది. ప్రాజెక్టు, కాల్వల నిర్మాణ సమయంలో మట్టి ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్వే నం.85లోని ఈ భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో ప్రభుత్వ రికార్డుల్లో ఇది ‘కెనాల్‌ భూమి’గా నమోదైంది. ప్రాజెక్టు, కాల్వల నిర్మాణం పూర్తవ్వడంతో ఈ భూమి నిరుపయోగంగా ఉంది. ఇటీవల కాలంలో హాలియా మండలంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. దీంతో కెనాల్‌ భూమిపై టీఆర్‌ఎస్‌ నేతల కన్నుపడింది. అనుమల మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు ఎక్కలూరి సైదిరెడ్డి, ఇదే మండలానికి చెందిన ఓ ప్రధాన తెలుగు దినపత్రిక విలేకరి ఏకమయ్యారు. సర్కార్‌ భూమిని తమ ఖాతాలో వేసుకొనేందుకు పావులు కదిపారు. అసలు భూమే లేని నల్లపరాజు చినదుర్గయ్య, కె.పరమేశ్‌ అనే వ్యక్తుల పేర్లతో 16 ఎకరాలకు పట్టా సృష్టించారు. వారు వ్యక్తిగత అవసరాలకోసం ఆ భూమిని విక్రయించినట్లు బాండ్‌పేపర్‌ రాయించుకున్నారు. దీని ఆధారంగా మిర్యాలగూడ ఆర్డీవో సంజీవరెడ్డి 2012లో ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’(ఎన్‌వోసీ) ఇచ్చినట్టు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాలు సృష్టించారు. భూమిని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే, ప్రభుత్వ భూమి ఒక్కసారిగా ప్రైవేటు భూమిగా మారిపోవడంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. నం.జి1189తో జారీ అయినట్టున్న ఎన్‌వోసీపై అనుమానాలు వ్యక్తమవ్వడంతో ‘ఆంధ్రజ్యోతి’ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించింది. దీంతో బండారం బయటపడింది. నం.జి1189 ఎన్‌వోసీ చందంపేట మండలం రేకులగడ్డ గ్రామానికి చెందినదని తేలింది. కెనాల్‌ భూమికి టెండర్‌పెట్టిన గులాబీ నేతలు అదే నంబరుతో నకిలీ ఎన్‌వోసీ సృష్టించి, ఆర్డీవో సంతకం ఫోర్జరీ చేసి, 16 ఎకరాలను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసుకొన్నారు.
సర్వే నం.85లోని భూమి నిడమనూరు సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తే వాస్తవం వెలుగులోకి వచ్చి, అక్కడి అధికారి అడ్డం పడే అవకాశం ఉందని గ్రహించిన గులాబీ నేతలు చండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సిబ్బందిని మచ్చిక చేసుకొని సర్కార్‌ భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. మొత్తం 16 ఎకరాల్లో.. 12 ఎకరాలను టీఆర్‌ఎస్‌ నేత ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, 2 ఎకరాలను ఆయన సోదరుడు సైదిరెడ్డి, మరో 2 ఎకరాలను ప్రధాన దినపత్రిక విలేకరి రిజిసే్ట్రషన్‌ చేయించుకున్నారు. కాగా, కెనాల్‌ భూమితోపాటు దళితుడికి చెందిన అసైన్డ్‌ భూమినీ అనుముల మండల టీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేశారు. తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. అసైన్ట్‌ భూమికి రిజిస్ట్రేషన్ చేయకూడదన్న నిబంధన ఉన్నా అధికారులు దాన్ని తుంగలో తొక్కి గులాబీ నేతల అక్రమాలకు అండగా నిలిచారు. కోట్ల విలువైన ఆ భూమిలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నేతలు ఎంచక్కా ప్లాట్లు వేసి దర్జాగా విక్రయించేస్తున్నారు.

అది సర్కార్‌ భూమే: తహసీల్దార్‌
అనుముల మండలం అల్వాల పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 85లోని 16 ఎకరాల కెనాల్‌ భూమిని ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి ఆయన సంబంధీకులు అక్రమంగా రిజిసే్ట్రషన్‌ చేయించుకోవడం వాస్తవమేనని తహసీల్దార్‌ నర్సయ్య తెలిపారు. చండూరు సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం పహాణీ చూడకుండా రిజిస్ట్రేషన్ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తమ విచారణలో.. ఆర్డీవో సంజీవరెడ్డి పేరిట ఇచ్చిన ఎన్‌వోసీ బోగస్‌ అని తేలిందన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిని కాపాడుతామన్నారు.

టీఆర్‌ఎస్‌ నేత మా స్థలాలను కబ్జా చేశారు
చింతల యాదగిరిపై హెచ్చార్సీలో బాధితుల ఫిర్యాదు
అఫ్జల్‌గంజ్‌ /హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నేత చింతల యాదగిరి, ఆయన కుమారులు తమ ఇళ్ల స్థలాలను కబ్జా చేశారంటూ బాధితులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితులు.. సతీష్‌, ఏ.ఆర్‌.కిషోర్‌ విలేకరులతో మాట్లాడారు. 1984లో రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం బోరంపేట్‌కి చెందిన సర్వే నెం.246 నుంచి 269 వరకు దాదాపు రెండు వేల ప్లాట్లను పలువురు మధ్యతరగతి కుటుంబాలవారు కొనుగోలు చేశారని తెలిపారు. అయితే చింతల యాదగిరి, ఆయన కుమారులు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ ప్లాట్లు తమవేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration