Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7944 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, September 30, 2015 - 6:19 pm: | |
అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు మరో వరం లభించింది. ముంబై, మంగళూరులను కాదని కేంద్రం ఆ వరాన్ని ఏపీకే ఇచ్చింది. ఆ వరం ‘దేశంలోనే తొలి డ్రెడ్జింగ్ హార్బర్’! 1890 కోట్ల రూపాయల విలువైన ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద గల అంతర్వేదిలో నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. అంతేకాదు.. ఈ హార్బర్ ద్వారా సాగరమాల ప్రాజెక్టుకు ఏపీ నుంచే తొలి అడుగు వేసింది. రాష్ట్రానికి ఉన్న విశాల కోస్తా తీరాన్ని ఉపయోగించుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు చేయూతను ఇచ్చింది. ముంబై, మంగళూరులలో ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల నుంచి ఒత్తిడి వచ్చినా.. కేంద్రం ఏపీ వైపే మొగ్గింది. అధికారులను చంద్రబాబు అప్రమత్తం చేసి.. తగిన సమయంలో స్థలాన్ని కేటాయించడంతో రాష్ట్రం చేతికి ఈ ప్రాజెక్టు వచ్చింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఆధ్వర్యంలో.. రూ.1890 కోట్ల వ్యయంతో ఈ హార్బర్ను నిర్మించనున్నారు. అక్టోబర్ 3న అంతర్వేదిలో హార్బర్కు కేటాయించిన స్థల పరిశీలనకు కేంద్ర బృందం రానుంది. ఆ బృందంలో డీసీఐ సీఎండీ రాజేశ్ త్రిపాఠి, డైరక్టర్ ఎం.ఎ్స.రావు, ఆపరేషన్ జీఎం కెప్టెన్ ఎస్.దివాకర్, కెప్టెన్ కె.ఎం. చౌదరిలతో పాటు డీసీఐ నాలెడ్జ్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న కోస్టల్ ఇండియా డెవల్పమెంట్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ శాస్ర్తిలు ఉన్నారు. కాగా, ఏర్పాటుకు ఏపీకి లేఖ ద్వారా సూత్రప్రాయ అంగీకారం తెలిపిన కేంద్రం.. మూడు విడతల్లో నిధులను మంజూరు చేసేందుకు ఒప్పుకొంది. మొదటి విడతలో రూ.730కోట్లు డీసీఐకి అందజేయనుంది. రెండో విడతలో రూ.640 కోట్లు, మూడో విడతలో రూ.520 కోట్లు నిధులను విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికనూ కేంద్రం తయారు చేసింది. డ్రెడ్జింగ్ హార్బర్లో శిక్షణా సంస్థ, వర్క్షాప్, జెట్టీల నిర్మాణం, డ్రెడ్జింగ్మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాల్లో ఎక్కడైనా ఇక్కడి నుంచే డ్రెడ్జింగ్ కార్యకలాపాలన్నింటినీ నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పోర్టుల అనుసంధానానికి సాగరమాల ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇక, అంతర్వేది వద్ద సాగరతీరంలో రెండు కిలోమీటర్లు విస్తరించనున్న ఈ డ్రెడ్జింగ్హార్బర్తో సాగరమాల ప్రాజెక్టుకు తొలి అడుగు పడినట్లు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరం వెంట విస్తృతంగా డ్రెడ్జింగ్కార్యకలాపాలు చేపట్టి అంతర్రాష్ట్ర జలమార్గాలను అభివృద్ధి చేసేందుకూ మార్గం సుగమం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కేవలం రెండేళ్లలో హార్బర్ను పూర్తిచేస్తామని డీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారు |