Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 7943 Registered: 03-2004 Posted From: 68.109.27.99
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, September 30, 2015 - 6:15 pm: | |
ఎపిలో పైలట్ ప్రాజెక్టు వాషింగ్టన్ : ఇంటర్నెట్ను మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తెచ్చే గూగుల్ ప్రధాన ఉత్పత్తి లూన్ పట్ల ప్రధాని నరేంద్రమోదీ ఆకర్షితులయ్యారు. గత వారాంతంలో ఆయన గూగుల్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు గూగుల్ ప్రతినిధులు దీని గురించి ఆయనకు వివరించగా అది దూర విద్య, గ్రామీణ పాఠశాలలు, టెలీ మెడిసిన్ విభాగాలకు ఎంత గానో ఉపయోగకరంగా ఉంటుదని ప్రధాని ప్రశంసించినట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇప్పటివరకు ఇంటర్నెట్ అందుబాటులో లేని గ్రామాలకు అది అందుబాటులోకి తేవడం తమ ప్రధాన లక్ష్యమని గూగుల్ అధికారులు ప్రధానికి వివరించారు. ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చినట్టయితే 16 కోట్ల మందిని పేదరికం రేఖ నుంచి పైకి తీసుకురావచ్చని తమ పరిశోధనలో తేలిందని వారు చెప్పారు. ఇప్పటివరకు దాన్ని ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాలకు కనెక్టివిటీ కోసమే వినియోగిస్తున్నారని, అవసరాన్ని బట్టి దాన్ని దూరవిద్య, టెలీమెడిసిన్తో సహా భిన్న విభాగాలకు విస్తరించే విషయం పరిశీలించవచ్చునని ప్రధాని సూచించారు. తనకు ఎంతో ప్రీతిపాత్రమైన కాన్సెప్ట్ ‘జామ్’ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ ఇందులోని జె అక్షరం జన్ధన్ యోజన, ఎ అక్షరం ఆధార్, ఎం అక్షరం మొబైల్ గవర్నెన్స్కు సంకేతంగా నిలుస్తాయని ప్రధాని వారికి తెలిపారని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. జన్ధన్ యోజన, ఆధార్లను ఇప్పటికే విస్తరించగా మొబైల్ గవర్నెన్స్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్లే విషయంలో గూగుల్ సలహా సహకారాలు అందించాలని ప్రధాని కోరినట్టు ఆయన చెప్పారు. అలాగే గూగుల్ టెక్నాలజీలు వ్యవసాయ రంగానికి ఏమైనా ఊతం ఇవ్వగలవా అని కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వర్షపాతాన్ని మదింపు చేయడం, భవిష్యత్తు పంట ధోరణులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఆ టెక్నాలజీలు ఎలా ఉపయోగపడతాయో పరిశోధించాలని ఆయన సూచించారు. |