Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7912
Registered: 03-2004
Posted From: 68.230.148.2

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, September 23, 2015 - 10:01 pm:   

17 వేల కోట్లు... శ్రీసిటీలో మరో చైనా కంపెనీ

రూ.8 వేల కోట్ల పెట్టుబడులకు లోంగీ ఓకే
తొలి విడతగా రూ.1670 కోట్లు
వెయ్యి మెగావాట్ల సోలార్‌ సెల్స్‌, పానెళ్లు
అక్కడే 500 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి
ఐదు వేల మందికి సంస్థలో ఉపాధి కల్పన
ఆర్‌ఈసీ నుంచి మరో 9 వేల కోట్ల రుణం
కృష్ణపట్నంలో క్రిభ్కో భాస్వరం, పొటాష్‌ ప్లాంట్‌
వెయ్యి కోట్ల పెట్టుబడి.. 6 లక్షల టన్నుల ఉత్పత్తి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైనా పర్యటన సత్ఫలితాలను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఒకేరోజు ఎంవోయూలు వెల్లువెత్తాయి. 17 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో చైనాకు చెందిన జియాన్‌ లోంగీ సిలికాన్‌ మెటీరియల్స్‌ కార్పొరేషన్‌ సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమలను స్థాపించనుంది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంగల సోలార్‌ సెల్స్‌, మరో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల సోలార్‌ మాడ్యూళ్లను ఉత్పత్తి చేయనుంది. ఇక్కడ తయారు చేసిన వాటిని విదేశాలకూ ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. వాటితో పాటు అక్కడే మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను సంస్థ ఉత్పత్తి చేసి.. రాష్ట్రానికి విక్రయించనుంది. మరోవైపు ఏపీ జెన్‌కో అనంతపురంలో 500 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి పార్కును ఏర్పాటు చేయనుంది. దానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ) రూ.3 వేల కోట్ల రుణం ఇవ్వనుంది. అలాగే, రాజధాని అమరావతి ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా స్థిరీకరణకు మరో రూ.6 వేల కోట్లను ఇవ్వనుంది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీజెన్‌కో-లోంగీ, శ్రీసిటీ-లోంగీ, ఏపీజెన్‌కో-ఆర్‌ఈసీ, ఏపీట్రాన్స్‌కో-ఆర్‌ఈసీల మధ్య నాలుగు వేర్వేరు అవగాహనా ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాల సందర్భంగా చైనా రాయబార కార్యాలయ మంత్రి లియూ జిన్‌సాంగ్‌, లొంగీ సంస్థ చైర్మన్‌ బావోషెన్‌ ఝొంగ్‌లు మాట్లాడారు. భారత్‌లో ఉత్పత్తికి చైనా ఆసక్తిగా ఉందని వెల్లడించారు. శ్రీసిటీలో తొలి విడత రూ.1670 కోట్లు పెట్టుబడి పెడతామని, 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యాపారానికి పెద్దపీట వేస్తున్నామని, నిరంతరాయ విద్యుత్‌తో పాటు సమగ్ర రాయితీలు ఇస్తున్నామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పారు. సులభంగా వ్యాపారం చేయదగ్గ రాషా్ట్రల్లో రెండో స్థానంలో నిలిచిన రెండు వారాల్లోనే భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం సంతోషకరమని రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్‌ జైన్‌ అన్నారు. రాబోయే 15 రోజుల్లో 2 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లకు బిడ్లు పిలుస్తామని, రెండు నెలల్లో పవన విద్యుత్‌లోనూ భారీ పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు.
ప్రధాని మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం ఇచ్చి సరిగ్గా బుధవారానికి ఏడాది అని, సరిగ్గా అదే రోజు ఈ ఒప్పందాలు జరగటం ఆనందంగా ఉందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అన్నారు. తమ సెజ్‌లో ఇప్పటికే నాలుగు చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయన్నారు. చంద్రబాబు వంటి డైనమిక్‌ ముఖ్యమంత్రితో పనిచేయటానికి తాము ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటామని ఆర్‌ఈసీ సీఎండీ రాజీవ్‌ శర్మ అన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో ఇతర రాషా్ట్రలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని, ఏపీకి ఎన్ని నిధులు కావాలన్నా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర పునురాత్పదక ఇంధన వనరుల శాఖ కార్యదర్శి త్రిపాఠి అన్నారు.

కృష్ణపట్నంలో క్రిభ్కో ప్లాంట్‌
ఎరువుల ఉత్పత్తి సంస్థ క్రిషక్‌ భారతి కో-ఆపరేటివ్‌ లిమిటెడ్‌ (క్రిభ్కో).. కృష్ణపట్నంలో భాస్వరం, పొటాష్‌ ఎరువులను ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుంది. వచ్చే పదేళ్ల వరకూ విద్యుత్‌ను ఒక్క రూపాయికే ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ఆఫర్‌, ఏడేళ్ల వరకూ వ్యాట్‌ మినహాయింపు తదితర మినహాయింపులివ్వడంతో రాష్ట్రంలో ప్లాంట్‌ పెట్టాలని నిర్ణయించినట్లు క్రిభ్కో చైర్మన్‌ చంద్ర పాల్‌ సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయాల వల్ల సంస్థకు 500 కోట్ల మేర ప్రయోజనాలు చేకూరుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిందని చెప్పారు. ఇప్పటిదాకా యూరియాను మాత్రమే ఉత్పత్తి చేసేవాళ్లమని, అయితే భాస్వరం, పొటాష్‌ను ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్‌ ఇదేనని ఆయన చెప్పారు. ఏడాదికి 6 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నెలకొల్పుతున్నామన్నారు. 4-5 ఏళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration