Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 23972 Registered: 08-2008 Posted From: 119.56.122.104
Rating: N/A Votes: 0 | Posted on Friday, August 14, 2015 - 12:26 am: | |
సగం శిక్ష పూర్తయ్యాక సాక్ష్యాలు తారుమారు సంజయ్ దత్కు ఆయుధాలివ్వలేదన్న అబూ సలేం హైదరాబాద్ : ముంబాయి 1993 పేలుళ్ల కేసుతో సంబంధం ఉందన్న అభియోగాలపై శిక్ష పడి సుమారు మూడోంతుల శిక్ష పేర్తి చేసిన సంజయ్ దత్ కేసులో మరో ఆసక్తికర అంశం బుధవారం ముంబాయి టాడా కోర్టులో చోటు చేసుకుంది. అదే కోర్టు సంజయ్ ఆరేళ్ల శిక్ష విధించింది. అతనికి శిక్ష విధించడానికి ప్రధాన కారణంగా తీసుకున్న అంశం తప్పని ప్రధాన సాక్షి వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ప్రస్తుతం విచారణ జరుగుతున్న కేసు సంజయ్ సంబంధించింది కాదు. అందుకే ఆ విషయంపై కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ విషయంలో సంజయ్ తన న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అంతే కాక సదరు వాంగ్మూలం ఆధారంగా తన కేసును పునర్విచారణ కోరవచ్చు. దాంతో పాటు బెయిల్ పొందే అవకాశం కూడా ఉంది. అసలు విషయం ఏమిటంటే సంజయ్ దత్ వద్ద ఆయు ధాలు దొరికాయి. అవి అప్పటిముంబాయి పేలుళ్లకు కుట్ర చేసిన దావూద్ గ్యాంగ్ ద్వారా ఆయనకు అందినట్లు కోర్టు నిర్దారించింది. ఆ ఆయుధాలు అబూ సలేం సంజుకు ఇచ్చినట్లు అప్పటి విచారణాధి కారులు కోర్టుకు వివరించారు. అందుకు సంబం ధించి సాక్ష్యాలు అందించారు. దీంతో ఆయనకు శిక్ష ఖరారైంది. అయితే ప్రస్తుతం అబూసలేంను విచారిస్తున్న కేసులో ఆయుధాలు సరఫరా అంశంపై విచారణ జరుగింది. అందులో సంజయ్ దత్కు ఆయుధాలు ఇచ్చాడన్న అభియోగాలు ఉన్నాయి. వాటిని అబూ సలేం ఖండించాడు. తను సంజయ్ దత్కు ఎలాంటి ఆయుధాలు ఇవ్వలేదన్నాడు. బాంబు పేలుళ్లకు ముందు తాను సంజు ఇంటికి వెళ్లలేదని ఆయనకు ఎలాంటి ఆయుధాలు కాని మందుగుండు కాని అందివ్వలేదన్నాడు. ఆయన వాంగ్మూలంను రికార్డు చేసిన టాడా కోర్టు విచా రణను వాయిదా వేసింది. అతని వాంగ్మూలం కాపీని తీసుకుని ఆ విషయంపై సంజయ్ దత్ కోర్టులో పోరాడే అవకాశం ఉంది. |