Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21735 Registered: 08-2008 Posted From: 103.246.92.206
Rating: N/A Votes: 0 | Posted on Sunday, August 17, 2014 - 5:56 am: | |
seems CM Ramesh is busy with Operation Aakarsh... జగన్ నివాసంలో వైసీపీఎల్పీ సమావేశం, 20 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు Published at: 17-08-2014 14:37 PM హైదరాబాద్, ఆగష్టు 17 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి లోటస్పాండ్లోని తన నివాసంలో ఆదివారం వైసీసీ శాసనసభాపక్షం సమావేశమైంది. సోమవారం (18వ తేదీ) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చెప్పారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నిపుణుల కమిటీ సూచనల మేరకు అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి సుమారు 20 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన వైసీపీఎల్పీ సమావేశం... 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో పార్టీ అధ్యక్షుడు జగన్ వారి కోసం ఎదురుచూసి రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. అయినా ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రయాణ సౌకర్యం లేనందున రాలేమని జగన్కు చెప్పినా... మిగిలిన ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారు. ఈ విషయమై జగన్ అందరిపై మండిపడినట్లుగా తెలుస్తుంది. |