Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21634 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Thursday, August 07, 2014 - 12:36 am: | |
చెన్నై: ప్రేమ మైకం, అతి వేగం వెరసి ఓ ప్రేమ జంటను ఆస్పత్రి పాలు చేసింది. ప్రియుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లగా, ప్రియురాలు స్వల్పగాయాలతో సంఘటనా స్థలం నుంచి జారుకుంది. అడయారు వంతెనపై మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... మైలాపూర్ నుంచి తిరువాన్మయూర్ వైపుగా సుమారు 23 ఏళ్ల యువకుడు మంగళవారం సాయంత్రం బైక్పై వెళుతున్నాడు. బైకులో అతని వెనుక ఒక యువతి కూర్చుని ఉన్నది. ఆ యువతితో మాట్లాడుతూ ఉన్న యువకుడు బైకును వేగంగా నడిపాడు. తిరువిక వంతెన వైపుగా అడయారు ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కింది. అడయారు వంతెన మలుపులతో కూడుకున్నది. మలర్ ఆస్పత్రిలో నుంచి వంతెనపైకి ఎక్కితే వంతెనపై భాగంలో ఒక మార్గం గిండి వైపుగాను, మరొక మార్గం తిరువాన్మయూర్ వైపుగాను డివైడ్ అవుతుంది. అందులో గిండికి వెళ్లే వారు బైకులో ఎంత వేగంగా వెళ్లిన సమస్య ఉండదు. అయితే ఆ వంతెనపై నుంచి ఎడమ వైపుగా తిరువాన్మయూర్కు వెళ్లాలంటే 15 నుంచి 20 కిలో మీటర్ల వేగంతో వెళ్లితేనే బైక్ అదుపు తప్పకుండా ఉంటుంది. బైకులో వెళ్లిన యువకుడు అతి వేగంగా వెళ్లాడు. ఇరుకైన వంతెనపై మలుపులో తిరగడం వీలుకాక రెప్ప పాటులో వంతెన అడ్డు గోడను ఢీకొంది. అప్పుడు బైకుపై ఉన్న జంట వంతెనపై నుంచి సినీ ఫక్కీలో వంతెన కింద పడిపోయారు. యువకుడు అడయారు సిగ్నల్ రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయూలయ్యూయి. ఇతనితో కూడా ఉన్న యువతి, వంతెన కింద వైపున సిగ్నల్లో నిలబడి ఉన్న జీప్ పై పడింది. వంతెన కూలి పండిందేమోనని జీపు డ్రైవర్ భయాందోళన చెందాడు. అంతలోపే జీపు అద్దాలు పగిలిపోయాయి. ఈ సంఘటనను సిగ్నల్ కోసం నిలబడి ఉన్న వాహన చోదకులు అందరూ చూసి దిగ్భ్రాంతి చెందారు. అనంతరం జీపుపై పడిన యువతిని కిందికి దింపారు. సమాచారం అందుకున్న అడయా రు ట్రాఫిక్ పోలీసులు అక్కడకి చేరుకుని ప్రాణాలతో పోరాడుతున్న యువకుడిని మల్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత ఉన్నత చికిత్స కోసం అతనిని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో జీపుపై పడి స్వల్పంగా గాయపడ్డ యువతి ఎవరికి తెలియకుండా ఆటోలో ఎక్కి తప్పించుకుంది. ఆమె చికిత్స కోసం వెళ్లిందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. కోమాలోకి వెళ్లిపోయిన యువకుడు ఎవరు అనే విషయం తెలియరాలేదు. అతను వచ్చిన బైకు నెంబరు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ బైకు యజమాని దానిని విక్రయించి విదేశాలకు వెళ్లినట్లుగాను తెలిసింది. దీంతో ప్రస్తుతం ఆ బైకు యజమాని ఎవరని తెలిస్తే కోమాలో ఉన్న ఆ యువకుడు ఎవరనే విషయం తెలుస్తుందని అడయారు పోలీసులు తెలుపుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. |