Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1096
Registered: 10-2005
Posted From: 71.63.229.222

Rating: N/A
Votes: 0

Posted on Monday, June 16, 2014 - 2:02 am:   

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పరిటాల సునీత మొట్టమొదటి సారిగా సొంత జి ల్లా అనంతకి రావడంతో అభిమానం ఉప్పొం గింది. అనంత హోరెత్తింది. జిల్లా పసుపు మయమైంది. మంత్రి పదవి చేపట్టాక పరి టాల సునీత ఆదివారం తొలిసారిగా జిల్లాలోకి అడుగుపెట్టారు. పార్టీ శ్రేణులు, పరిటాల అభిమానులు, అధికారులు, అనధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు ప్రాంతం గుత్తి సమీపంలోని బాట్లో సుంకులమ్మ దేవాలయం వద్దకు మంత్రి చేరుకున్నారు. పరిటాల సునీతను చూడగానే అభిమానం ఉప్పొంగిపోయింది. నినాదాలు మి న్నంటాయి. ఉత్సాహం ఉరకలెత్తింది... 'పరిటాల రవీంద్ర అమర్ రహే.. పరిటాల శ్రీరామ్ జిందాబాద్..' అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జనం ఆమెను చూడటానికి తండోపతండాలుగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. వేలాది వా హనాలతో జాతీయ రహదారి దిగ్భందమైంది. అక్కడి నుంచి ఆమె భారీ కాన్వాయ్‌తో జిల్లాలోకి ప్రవేశించారు. ర్యాలీ ఏకధాటిగా 12 గం టల పాటు సాగింది. మంత్రి పరిటాల సునీతకు అడుగడుగునా జన నీరాజనం పలికారు. పూలవర్షం కురిపిస్తూ ఆమెను ముంచెత్తారు. గజమాలలతో సత్కరించి అభిమానాన్ని చా టుకున్నారు. ఓ వైపు పూలవర్షం... మరోవైపు పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలం... ఇం కోవైపు డప్పుల మోత... బాణాసంచా శబ్దాల తో అనంత దద్దరిల్లింది. జాతీయ రహదారం తా పసుపుమయమైంది. ముఖ్యంగా 12 గం టల పాటు సాగిన ఈ సుదీర్ఘ ర్యాలీలో మంత్రి తనయుడు శ్రీరామ్ ప్రత్యేకాకర్షణగా నిలిచా రు. ఆయనకు యువత అండగా నిలిచింది. యువత పెద్దఎత్తున ర్యాలీలో పాల్గొనడం విశే షం. గుత్తిలో ఏ తరహా అయితే మంత్రి పరిటాల సునీతకు అభిమానం వెల్లువెత్తిందో అదే ఒరవడి ఆమె స్వగ్రామమైన వెంకటాపురం వ రకూ కొనసాగడం పరిటాల కుటుంబంపై ఉ న్న అభిమానాన్ని చాటిచెప్పింది.
సుదీర్ఘ ర్యాలీ సాగిందిలా...
పరిటాల సునీత ఉదయం 11.45 నిమిషాలకు జిల్లా సరిహద్దు ప్రాంతమైన బాట్లో సుం కులమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే జితేం ద్రగౌడ్, వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు, అధికారులు, అనధికారులు మంత్రి ప రిటాల సునీతకు ఘన స్వాగతం పలికారు. అ నంతరం సుంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే అభిమానులు ఏర్పాటు చేసిన కేక్‌ను మంత్రి కట్ చేశారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ప్రత్యేక వాహనంలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ నిల్చుని ముందు కు సాగారు. వేలాది మంది అభిమానులు వా రికి స్వాగతం పలుకుతూ ర్యాలీగా కదిలారు. మంత్రి, శ్రీరామ్ ఆనందంతో చిరునవ్వులు చిం దిస్తూ తమ అభిమానులకు విక్టరీ చూపిస్తూ... రెండు చేతులు జోడించి నమస్కరించారు. ప్ర తి పల్లె వద్ద అభిమానులు వారి కోసం వేచి చూశారు. అడుగడుగునా మంత్రిని స్వాగతి స్తూ అభిమానాన్ని చాటుకున్నారు. సాయం త్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలోకి అడుగు పెట్టారు. ఇక్కడ కూడా అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమాన నేతకు స్వాగతం ప లికారు. పూలవర్షం కురిపిస్తూ... మరోవైపు పెద్దఎత్తున బాణాసంచా పేల్చుతూ ముందు కు సాగారు. రెండు గంటలకుపైగానే జిల్లా కేం ద్రంలో ర్యాలీ కొనసాగింది. తాడిపత్రి బస్టాండ్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. అటు నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉ న్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అ క్కడ టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి మంత్రి సునీత, పరిటాల శ్రీరామ్ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అక్కడి నుంచి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా మున్సిపల్ అతిథిగృహం వ రకూ ర్యాలీ సాగింది. రాత్రి 7 గంటలకు పరిటాల సునీత ర్యాలీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంది.
మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అభినందనలు
తెలిపిన టీడీపీ నేతలు, అధికారులు...
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్‌కు మంత్రి పరిటాల సునీత చేరుకోగానే టీడీపీ నే తలు, అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేలు బీకే పార్థసారధి, వరదాపు రం సూరి, ఉన్నం హనుమంతురాయచౌదరి, వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, ఈరన్న, ఎమ్మెల్సీ లు శమంతకమణి, మెట్టు గోవిందరెడ్డి, గుం డుమల తిప్పేస్వామి, ఇతర ప్రముఖ నేతలు పరిటాల సునీతకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ సెంథిల్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఉమామహేశ్వరరావు, సివిల్ సప్లై డీఎం వెంకటేశం, ఆ శాఖ ఇతర అధికారులు, సిబ్బంది, జిల్లా వి ద్యాశాఖాధికారి మధుసూదన్‌రావు, పోలీసు లు నూతన మంత్రి పరిటాల సునీతకు అభినందనలు తెలియజేశారు.
అర్ధరాత్రి వరకూ సాగిన సునీత ర్యాలీ...
మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో దాదాపు గంటన్న ర పాటు మంత్రి గడిపారు. నాయకులు, అధికారులు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేయడానికి పోటీ పడ్డారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో హమాలీలకు యూని ఫాం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆమె చేతుల మీదుగా ఒక్కో హమాలీకి రెండు జతల యూనిఫాం అందజేశారు. అనంతరం స్వగ్రామం వెంకటాపురానికి బయల్దేరి వెళ్లా రు. రామ్‌నగర్, రుద్రంపేట వరకూ ర్యాలీ కొ నసాగింది. రుద్రంపేట బైపాస్‌లో నల్లచెరువు జడ్పీటీసీ నాగరత్నమ్మ, టీడీపీ జిల్లా కార్యదర్శి నాగభూషణం నాయుడు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రి పరిటాల సునీత రాప్తాడుకు చేరుకున్నారు. అక్కడ వేలాది మంది పార్టీ శ్రేణులు, అభిమానులు మంత్రి సునీతకు స్వాగతం పలికారు. అటు నుంచి ఎన్ఎస్ గేట్ వరకూ పలు ప్రాంతాల్లో తమ అభిమాన నా యకురాలికి స్వాగతం పలికారు. ఎన్ఎస్ గేటు నుంచి రామగిరి మీదుగా వెంకటాపురానికి బయల్దేరారు. అక్కడి నుంచి వెంకటాపురం వ రకూ రాత్రయినా ఆ ప్రాంతప్రజలు, అభిమానులు మంత్రి సునీత, పరిటాల శ్రీరామ్ కోసం వేచి చూశారు. పల్లె జనం రోడ్డుకు తరలివచ్చి తమ నేతలకు అపూర్వ స్వాగతం పలికారు. అర్ధరాత్రి వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. వెం కటాపురం చేరుకొని పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద మంత్రి సునీత, కుటుంబ సభ్యులు ఇతర నాయకులు నివాళులర్పించి, ఇంటికి చేరుకున్నారు. 12 గంటల పాటు మంత్రి పరిటాల సునీత సుదీర్ఘ స్వాగత ర్యాలీ కొనసాగింది. పరిటాల కుటుంబంపై ఉన్న అభిమానాన్ని జిల్లా ప్రజలు మరోసారి చూపించారు. దీంతో సునీతతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎంతో ఆనందపడుతూ కనిపించారు.
మీ అభిమానాన్ని మరువను..:
పరిటాల సునీత
పరిటాల కుటుంబంపై మీరు చూపిస్తున్న అభిమానాన్ని ఎన్నటికీ మరువనని నూతన మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత మాట్లాడాల ని అభిమానులు కేరింతలు వేశారు. దీంతో మంత్రి పరిటాల సునీత అభిమానులద్దేశించి మాట్లాడుతూ... 'ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నా... మీరు చూపిన అభిమానాన్ని నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ మరువను. కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉంటాన'ని అ భయమిచ్చారు. పరిటాల రవీంద్రను కాంగ్రెస్ హయాంలో పొట్టన పెట్టుకున్నారని... ఆ నరరూప హంతకులకు శిక్ష పడే వరకూ పోరాటం సాగిస్తానని పేర్కొన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... 'ఈ రోజు ఫాదర్స్ డే. నాన్న దగ్గర లేకపోవడం బాధ కల్గుతోంది. ఈ రోజు ఇంత మంది అభిమానాన్ని మా నాన్న తనకు ఇచ్చి వెళ్లడం ఎంతో గర్వంగా ఉంది. మీ అభిమానాన్ని చిరస్థాయిగా నిలుపుకుంటాన'ని అభిమానులకు శ్రీరామ్ హామీ ఇచ్చారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration