Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1095 Registered: 10-2005 Posted From: 71.63.229.222
Rating: N/A Votes: 0 | Posted on Monday, June 16, 2014 - 2:01 am: | |
పేద ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకున్న పరిటాల కుటుంబం పట్ల ప్రజల్లో అభిమానం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఆ కుటుంబం పేద బడుగు బలహీనవర్గాలకు ఎంత అభిమానం ఉందో ఆ దివారం మంత్రి పరిటాల సునీతకు లభించిన అపూర్వ స్వాగతాన్ని బట్టి తెలుస్తోంది. 1994 లో నందమూరి తారకరామారావు ఆశీస్సుల తో రాజకీయ అరంగేట్రం చేసిన పరిటాల ర వికి మొదటిసారే మంత్రి పదవి లభించింది. కార్మికశాఖ మంత్రిగా కొద్దికాలం మాత్రమే పదవిలో ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయిలో తనకం టూ చెరగని ముద్ర వేసుకున్నారు. అప్పటి నుంచి ఆ కుటుంబాన్ని జిల్లా ప్రజలు ప్రధానంగా పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గ వా సులు ఆదరిస్తూనే ఉన్నారు. పరిటాల రవిని వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పెనుకొండ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకోగా, ఆయన మరణానంతరం కూడా ఆ కుటుంబాన్ని జిల్లా ప్రజలు వెన్నంటే ఉన్నారు. 2005లో పరిటాల రవి హత్యానంతరం ఆ యన సతీమణి పరిటాల సునీతను పెనుకొం డ, రాప్తాడు నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. పరిటాల సునీత వరుసగా మూడుసా ర్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం పరిటాల సునీతకు తెలుగుదేశం ప్రభుత్వంలో పౌరసరఫరాలశాఖ మం త్రి పదవి లభించింది. దీంతో పదవీ బాధ్యతలు చేపట్టిన పరిటాల సునీత మొదటిసా రిగా ఆదివారం జిల్లాకు రావడంతో జిల్లా పొ లిమేర నుంచి కనీవినీ ఎరుగని రీతిలో అశేష జనవాహిని హాజరై ఘనస్వాగతం పలికారు. నాడు పరిటాల రవి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు వచ్చినపుడు చూ పించిన లాగానే ఆదరాభిమానాలను పరిటా ల సునీతపై చూపడం విశేషం. 20 ఏళ్ల తరువాత ఆ కుటుంబానికి మంత్రి పదవి దక్కడంతో జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా పరిటాల అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవు. దీంతో పార్టీ శ్రేణులు, పరిటాల అభిమానులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా మంత్రి కాన్వాయ్కి ఎదురేగి ఘనస్వాగతం పలుకుతూ వారి పట్ల తమకున్న అభిమానం చూపించుకున్నారు. పరిటాల కుటుం బం పట్ల ఇప్పటికీ ఇంత అభిమానం ఉందా అన్న విమర్శకులే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. రాప్తాడులో మంత్రి సునీతకు అపూర్వ స్వాగతం... టీడీపీ కంచుకోటలా మార్చుకున్న రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీతకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతపురం నగరంలో తన పర్యటన ముగించుకుని రాప్తాడులోకి అడుగుపెట్టిన మంత్రికి ఊహించని రీతిలో ఆదరణ లభించింది. మంత్రి పదవి స్వీకరించిన తరువాత పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టగానే వేలాదిమంది మహిళలు ఆమెకు పలకడానికి పోటీపడటం కనిపించింది. నియోజకవర్గ కేంద్రంలో సునీత తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను చూడగానే అభివాదం చేస్తూ చిరునవ్వుతో ప లకరిస్తూ విక్టరీ గుర్తును చూపిస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. సునీతను చూడగానే ప్రజలు పరిటాల రవి అమర్ రహే, పరిటాల సునీత, శ్రీరామ్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు. పరిటాల సునీత మధ్యా హ్నం 2 గంటలకు రావాల్సి ఉండగా రాత్రి 9.20 గంటలకు చేరుకుంది. అక్కడి నుంచి కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్దకు 10 గంటలకు చేరుకోగా అభిమానులు వేచి ఉండి తమ అభిమాన మంత్రికి ఘనస్వాగతం పలికారు. మామిళ్లపల్లిలో వందలాదిమంది మహిళలు కాన్వాయ్కి ఎదురేగి హారతులు ప ట్టారు. అక్కడి నుంచి సీకే.పల్లి మండలం ఎన్ఎస్.గేటుకు 10.40 గంటలకు చేరుకోగానే వే లాదిగా ఎదురుచూస్తున్న అభిమానులు ఒక్కసారిగా మంత్రి సునీతను చూసి ఆనందపరవశులయ్యారు. మధ్యాహ్నం నుంచి దాదాపు అర్ధరాత్రి వరకు మంత్రి కోసం ఎదురుచూసిన అభిమానులు సునీతకు బ్రహ్మరథం పట్టారు. రాప్తాడు నుంచి వెంకటాపురం వరకు ప్రతి గ్రామగ్రామానా బాణసంచా కాలుస్తూ తమ అభిమాన నాయకురాలికి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రామగిరి మండలం శ్రీహరిపురం చేరుకున్న సునీత పరిటాల రవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత కుంటిమద్ది, పోలేపల్లి, చెర్లోపల్లి, రామగిరి, కొత్తపల్లి, గంగంపల్లి, నసనకోట మీదుగా స్వగ్రామమైన వెంకటాపురంకు రా త్రి 12 గంటలకు చేరుకుంది. పరిటాల ఘాట్కు ఘన నివాళి... ఉద్వేగానికి లోనైన మంత్రి సునీత:-స్వగ్రామానికి చేరుకున్న వెంటనే మంత్రి సునీత నేరుగా కుటుంబ సభ్యులతో కలిసి తన భర్త స్వర్గీయ పరిటాల రవీంద్ర ఘాట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఆయన సమాధిపై ఫుష్పగుచ్చములు ఉంచి కొన్ని నిమిషాల పాటు నివాళ లర్పించి మౌనం పాటించారు. ఆ సమయం లో సునీత ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపటికి తేరుకుని అక్కడికి వ చ్చిన వేలాది మంది జనానికి అభివాదం చేస్తూ ఆప్యాయంగా పలుకరిస్తూ కొద్దిసేపు అభిమానులతో ముచ్చటించింది. పరిటాల సునీత ఇంటివద్దకు చేరుకోగానే అప్పటికే వేచి ఉన్న మహిళలు ఆమెకు దిష్టి తీసి లోపలికి ఆహ్వానించారు |