Fanno1
Yavvanam Kaatesina Bewarse Username: Fanno1
Post Number: 6672 Registered: 03-2004 Posted From: 68.43.143.164
Rating: N/A Votes: 0 | Posted on Friday, May 02, 2014 - 9:24 pm: | |
చంద్రబాబు నుంచి తనకు పోటీ తీవ్రంగా ఉన్న విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాలలో ప్రతి వాక్యాన్ని చంద్రబాబు పేరుతో ప్రారంభిస్తున్నారు. చంద్రబాబు పేరు ఉచ్చరించకుండా ఆయన ప్రసంగం ఉండటం లేదు. ప్రారంభంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విభజించిందని విమర్శించిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. చంద్రబాబును నమ్మవద్దని కోరుతున్నారు. రాజధాని కూడా లేకుండాచేసి విభజించిన తమ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అనుభవం ఉన్న చంద్రబాబే అవసరమని పట్టణ ప్రాంతాల ప్రజలు బలంగా నమ్ముతున్నారు. రుణమాఫీ హామీ రైతులలోకి చొచ్చుకుపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా చంద్రబాబు తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేయడంతోపాటు చంద్రబాబుపై ముప్పేట దాడి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి నాయకుడు ఎన్నో కొన్ని అబద్ధాలు చెబుతారు. ఉదాహరణకు తనను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది శాసనసభ్యులు సంతకాలు పెట్టి కోరినా జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారని వైసీపీ విడుదల చేసిన ప్రచార సీడీలలో పేర్కొంది. నిజానికి తాను ఆశించిన ముఖ్యమంత్రి పదవిని ఎమ్మెల్యేలు బలపరచినా, ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించడం వల్లనే జగన్ కాంగ్రెస్ను వీడారన్నది బహిరంగ రహస్యం. అలాగే గతంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా రాజశేఖర్ రెడ్డిని సోనియాగాంధీనే చంపించారంటూ విజయలక్ష్మి, షర్మిల అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ప్రస్తావనే తేవడం లేదు. అంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి మరణాన్ని కూడా ఎన్నికల్లో గెలవడానికి వాడుకున్నారన్నమాట! |