Sakkineni
Pilla Bewarse Username: Sakkineni
Post Number: 499 Registered: 04-2012 Posted From: 199.168.151.169
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 24, 2014 - 12:56 pm: | |
కొడాలి నాని మొన్నటి వరుకు తెలుగు దేశం పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో విదేయుడు గా ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్ పట్టు బట్టి మరి గుడివాడ టికెట్ ను సిట్టింగ్ ఎం.ల్.ఎ రావి ని కాదని 2004 లో నాని కి ఇప్పించాడు. ఎన్టీఆర్ తో ఏంటో విదేయం గ వుండే నాని గత సంవత్సరం జగన్ పార్టీ లో వెళ్లి కలిసాడు అదే సమయం లో ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు కుటుంబానికి వచ్చిన అంతరం తో అందరు ఎన్టీఆర్ కావాలనే నాని ని పార్టీ మార్పించాడు అని అందరు అనుకున్నారు కానీ చిన్న చిన్నగా వెలుగులోకి వచ్చిన నిజాల దృష్ట్యా నాని ఎన్టీఆర్ ను దారుణం గ మోసం చేసాడు అని తెలిసింది 2007 లో రియల్ ఎస్టేట్ బూమ్ లో వున్నా సమయం లో నాని ఎన్టీఆర్ చేత 12 ఎకరాల భూమిని 70లక్షల చొప్పున 8కోట్ల40లక్షల రూపాయలకి ఎన్టీఆర్ కి నాని కొనిపించాడు, ఆ తర్వాత 2011లొ ఎన్టీఆర్ కి ప్రముక రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కూతురి తో వివాహం అయినది, 18నెలలు తరువాత ఎన్టీఆర్ తన మామతొ తనకి 12 ఎకరాల స్తలం ఉన్నది అని డాకుమెంట్స్ చూపించాడు , దానిని చెక్ చేస్తే అది లావణ్య పట్టా భూమి గవెర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాడు, అది ఎలా వచ్చింది అని వెరిఫై చేయగా ఎకరానికి 1లక్ష చొప్పున నాని మరియు తన ఫ్రెండ్ తో కలసి కొని వెంటనే ఎన్టీఆర్ కి 70లక్షల చొప్పున 8,40,00,000/- కి అమ్మాడు అని తెలిసింది, ఈ విషయం ఎన్టీఆర్ కి తెలిసింది అన్నక్షణం జగన్ పార్టీ లోకి వెళ్ళిపోయాడు నాని, తనని ఇంత నమ్మితే నమ్మించి మోసం చేసాడని తెలిసింది కానీ ఇందులో నిజాలు ఎలా వున్నా ఈ సంగటన తర్వాత కూడా ఎన్టీఆర్ మామ నార్నే కూడా జగన్ పార్టీ లోకి వెళ్లి వెనక్కు రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ కూడా నిన్న మొన్నటి వరకు నిజాలు తెలియక తన కుటుంభానికి తన తాత స్థాపించిన పార్టీ కి దూరంగ వుండటం తన కెరియర్ మీద ఎంతో ఎఫెక్ట్ చూపించింది. నిజాలు తెలుసుకొని తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుదేసం లోనే వుంటా అంటన్న ఎన్టీఆర్ ను తెలుగు తమ్ముళ్లు ఎలా ఆదరిస్తారో చూద్దాం. |