Superman
Kurra Bewarse Username: Superman
Post Number: 1023 Registered: 10-2005 Posted From: 75.73.208.143
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 17, 2014 - 12:47 pm: | |
తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య ఎన్నికల పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సీట్ల పొత్తుపై కన్ఫ్యూజన్ ఏమీ లేదని బిజెపి నాయకుడు ప్రకాశ్ జవదేకర్ గురువారం సాయంత్రం హైదరాబాద్లో వెల్లడించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి గల ఆక్షేపణల విషయాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వివరించారు. బలహీనమైన అభ్యర్ధులను బిజెపి నిలబెట్టడంవల్ల ప్రత్యర్థులకే ఎక్కువ లాభమని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. గెలిచే అభ్యర్థులను నిలబెడితే సమస్య లేదని, కాని ఓడిపోయే అభ్యర్థులను బిజెపి నిలబెట్టడంలో అంతరార్థం ఏమిటని తెలుగుదేశం పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ మొండి వైఖరి వల్ల కనీసం పది పార్లమెంటు స్థానాలను, 30 అసెంబ్లీ స్థానాలను వైసీపీకి అప్పగించినట్టవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. సంఘ్ పరివార్ కర్ర పెత్తనం వల్ల కూడా పొత్తు వ్యవహారం సరిగా ముందుకు పోవడం లేదని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. సొంత బలం గురించి ముందు వెనుకలు ఆలోచించుకోకుండా బిజెపి మొండి వైఖరిని అవలంబించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రుచించడం లేదు. సొంతంగానే పోటీ చేస్తే తెలుగుదేశం లాభపడుతుంది గాని బలం లేని స్థానాలను బిజెపికి వదిలేయడంవల్ల ప్రత్యర్థులకే లాభమని వారు పార్టీ అగ్రనాయకత్వానికి వివరిస్తున్నారు. వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్న చంద్రబాబుకు ఆదాని వ్యవహారం కూడా రుచించడంలేదు. నరేంద్ర మోదీ సన్నిహితుడైన పారిశ్రామికవేత్త జగన్ను కలవడం వెనుక మతలబు ఏమిటని ఆయన నేరుగా బిజెపి అధిష్ఠానం దగ్గరే తమ ఆక్షేపణ వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. |