Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6548
Registered: 03-2004
Posted From: 68.43.29.127

Rating: N/A
Votes: 0

Posted on Saturday, February 08, 2014 - 9:52 pm:   

saskhi lo news ledanukuntaa.

-కేసీఆర్‌కు వైఎస్ బంపర్ ఆఫర్!
తెలంగాణ ఏర్పడటం ఎప్పటికైనా అనివార్యం. ఈ కారణంగా రాజకీయ పార్టీలన్నీ బాధ్యతతో వ్యవహరించి ప్రజలను మభ్య పెట్టవద్దని కోరుకుందాం. వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తే సమస్య పరిష్కారం మరింత జాప్యం అవుతుంది. అయితే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు అధికారమే అంతిమ లక్ష్యం. వారి ఆటలో బలిపశువులు కాకుండా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ కోసమే తాను జన్మించినట్టు చెప్పుకొంటున్న కేసీఆర్ కూడా ఇతరుల లాగానే అధికార కాంక్షకు అతీతులు కారని తెలియజెప్పే ఒక సంఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించడం అవసరం. 1999లో చంద్రబాబు నాయుడు రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోని విషయం విదితమే! ఆ తర్వాత కొంత కాలానికి జరిగిన సంఘటన గురించి చాలామందికి తెలియదు. రెండవసారి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏడాదికి అంటే 2000 సంవత్సరం చివరిలో దివంగత రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రతిపాదనను కేసీఆర్ ముందుపెట్టారు. అప్పటికే తనకు మంత్రి పదవి లభించనందుకు ఆగ్రహంగా ఉన్న కేసీఆర్‌ను ఉపయోగించుకుని చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నది వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి 60 మంది శాసనసభ్యులను సమీకరించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 90 మంది సభ్యులు మద్దతు ఇస్తారని, అప్పుడు మీరే ముఖ్యమంత్రి కావచ్చునని కేసీఆర్‌కు రాజశేఖర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ తెగ నచ్చిన కేసీఆర్, తెలుగుదేశం పార్టీలో తనకు సన్నిహితంగా ఉండే కొంతమందిని పోగేసి వారి ముందు ఈ ప్రతిపాదన పెట్టారు. రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఆఫర్ వల్ల మనందరికీ ఎంతో మంచి జరుగుతుంది అంటూ, అదెలాగో కూడా వివరించి అరచేతిలో వైకుంఠం చూపించడానికి ప్రయత్నించారు. అయితే ఆనాటి ఆ సమావేశంలో పాల్గొన్న ఒక ముఖ్యుడు ఆ ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించారు.
దీంతో కేసీఆర్- వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల ప్లాన్ ఫలించలేదు. ఆ తర్వాతే తెలంగాణవాదాన్ని కేసీఆర్ భుజానికెత్తుకున్నారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration